సఫారీ గడ్డపై పర్యటిస్తున్న టీమిండియా మహిళల జట్టు అతిధ్య జట్టును చిత్తుచేసి ఐదు టీ20 మ్యాచ్ లలో సీరిస్ కైవసం దిశగా అడుగులు వేస్తుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు నిర్దేశించిన 143 పరుగుల విజయలక్ష్యాన్ని మిథాలీ సేన సునాయాసంగానే సాధించింది. దీంతో ఐదు టీ20 మ్యాచ్లలో రెండు మ్యాచులలో విజయాన్ని సాధించి మిగిలిన మూడు మ్యాచ్ లలో విజయాలను అందుకునే దానిపై దృష్టిసారించింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత మహిళల క్రికెట్ జట్టు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
143 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత మహిళల జట్టుకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. మిథాలీ రాజ్ కూడా తనదైన శైలిలో అజేయ ఇన్నింగ్స్ అడింది. కేవలం 61 బంతుల్లో 76 పరుగులు చేసి అజేయంగా నిలింది. దీంతో టీమిండియా జట్టు విజయపథంలో నడిచింది. మరో ఓపెనర్ స్మృతి మంథాన 42 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 57 పరుగులు చేసింది. ధాటిగా ఆడే ప్రయత్నంలో దక్షిణాఫ్రికా బౌలర్ డేనిల్స్ చేతిలో ఎల్బీగా వెనుదిరిగింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 7(12బంతుల్లో), మిథాలీ రాజ్తో కలిసి లాంఛనం పూర్తిచేసింది.
అంతకుముందు బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా జట్టులో ఓపెనర్లు లీ 15(12బంతుల్లో; 3×4), కెప్టెన్ డేన్ వాన్ 15(18బంతుల్లో; 2×4) మంచి శుభారంభమే ఇచ్చారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన సునే లస్ 33(32బంతుల్లో; 2×4), మరో క్రికెటర్ డి కెర్క్ 26(28బంతుల్లో;1×4)కలిసి నిలకడగా ఆడటంతో దక్షిణాఫ్రికా జట్టు భారత్ ముందు 143లక్ష్యాన్ని్ నిర్దేశించగలిగింది. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్, అనూ పాటిల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more