రాహుల్ ద్రావిడ్. ది వాల్ గా ప్రసిద్ది చెందిన మాజీ టీమిండియా కెప్టెన్.. తన పదవీకాలం తరువాత టీమిండియా భావితరాల జట్లను తీర్చిదిద్ది వారికి మెలకువలను నేర్పే పనిలో వున్నారు. అదేనండీ భారత అండర్ -19, భారత్ -ఎ క్రికెట్ జట్లకు కోచ్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన పదవికాలం ముగిసిపోతున్న క్రమంలో టీమిండియా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి అంక్షలు విధించినట్లుగా.. ఎలాంటి మెలికలు లేకుండా బిసిసిఐ పరిపాలన కమిటీ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలాన్ని పొడిగించింది.
ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండర్ -19, భారత్ -ఎ క్రికెట్ జట్టు కోచ్ ను ఎంపిక చేసే క్రమంలో కూడా ఇంటర్య్వూలో నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వచ్చిన నేపథ్యంలో అలాంటి వాటిని దూరంగా పెట్టిన బిసిసిఐ రాహుల్ ద్రావిడ్ తన సత్తాను ప్రూవ్ చేసుకున్నాడని, అతని శిక్షణలో అనేక మంది యువ క్రికెటర్లు సత్తా చాటేందుకు రెడీ అయ్యారని భావించిన బిసిసిఐ ద్రావిడ్ పదవీ కాలాన్ని పొడిగించింది.
అయితే ద్రవిడ్ పదవీ కాలాన్ని పొడిగించే క్రమంలో ముందుగా భావించినట్లు ఎలాంటి షరతులు, ఇంటర్వ్యూలు లేకుండా ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకుంది. భారత్ యువ క్రికెటర్లకు ద్రవిడ్ మార్గదర్శకం అవసరమని బీసీసీఐ భావిస్తోంది. దాంతో అతన్నే తిరిగే ఎంపిక చేసే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. కాగా, భారత్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కోచ్ పదవిలో కుంబ్లేను కొనసాగిస్తారా లేక కొత్త వారికి అవకాశం ఇస్తారా అనే తేలడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more