చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా అదివారం దక్షిణాఫ్రికాతో జరగనున్న మ్యాచ్ విరాట్ సేనకు అత్యంత కీలకం కానుంది. సెమీస్ అశలు సజీవంగా వుండాలంటే ఈ మ్యాచ్లో తప్పనిసరిగి టీమిండియా గెలుపోందాల్సిందే. అటు సపారీలకు కూడా ఈ మ్యాచ్ అంతే కీలకం. పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలైన సఫారీలకు టీమిండియాతో జరిగే మ్యాచ్ గెలిస్తేనే సెమీస్ కు వెళ్లగలుగుతుంది. దీంతో రెండు జట్లకు ఈ అదివారం పెద్ద పరీక్షగానే నిలువనున్నాయి. రేపు జరిగే మ్యాచ్ లో ఇరు జట్లకు ప్రతిష్ట్మాతకంగా మారడంతో ఇరు జట్లు గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తున్నారు.
సపారీల గెలుపు మాట అటుంచితే.. టీమిండియా గెలుపు కోసం విరాటుడు మాత్రం కొత్త వ్యూహాలను రచిస్తున్నాడు. ఇంగ్లాండ్ వేదికగా అక్కడ ఫీల్డులపై జరుగుతున్న టోర్నీలో స్పిన్నర్ల కన్నా అల్ రౌండర్లకు ప్రాధాన్యతను ఇచ్చిన కోహ్లీ.. ఇక టీమిండియా స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ తదుపరి మ్యాచ్ లలో తీసుకోనున్నాడని సమాచారం. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ లో డీకాక్, డుమిని, డేవిడ్ మిల్లర్ల వంటి ఎడమచేతి స్టార్ ఆటగాళ్లు ఉండటం చేత అశ్విన్ ను తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఆఫ్ బ్రేక్ బౌలింగ్ ను ఎదుర్కోవడం కష్టం కనుక అశ్విన్ ను ప్రయోగించే అవకాశాలు లేకపోలేదు.
రేపటి మ్యాచ్ లో అశ్విన్ కు చోటు దక్కుతుందని దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ నీల్ మెకన్జీ సైతం అభిప్రాయపడ్డాడు. తమతో చావో రేవో మ్యాచ్ లో అశ్విన్ ఎంపిక కూడా కీలకం కానుందని మెకన్జీ పేర్కొన్నాడు.ఈ మేరకు భారత జట్టు తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలున్నాయన్నాడు. మరొకవైపు శ్రీలంకతో ఓటమి భారత ఆటగాళ్ల మదిలో తీవ్రంగా ఉందన్నాడు. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ పై ఒత్తిడి నెలకొన్న తరుణంలో దాన్నిసద్వినియోగం చేసుకుంటామన్నాడు. అయితే ఒక్క మ్యాచ్ లో ఓటమితో భారత్ ను తక్కువగా అంచనా వేయడం లేదన్నాడు. కచ్చితంగా భారత్ తో రసవత్తర పోరు ఖాయమన్నాడు.
కాగా అశ్విన్ లేకుండా టీమిండియా జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలోకి అడుగుపెట్టడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అశ్విన్ తో విభేధాల కారణంగానే అతన్ని కోహ్లీ తుది జట్టులోకి తీసుకోవడం లేదన్న విమర్శలు కూడా వినబడుతున్న తరుణంలో.. జట్టు ప్రయోజనల నేపథ్యంలో వ్యక్తిగత విభేదాలను పక్కనబెట్టాలన్న సూచనలు కూడా వినబడుతున్నాయి. టీమిండియా డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి నిలుస్తున్న క్రమంలో కేవలం 191 మ్యాచ్ లలో 288 వికెట్లు సాధించిన ఛాంపియన్ కు పక్కనబెట్టడం ఎంతవరకు సమంజమని కూడా పలువురు మాజీ టీమిండియా బౌలర్లు ప్రశ్నిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more