భారత క్రికెట్ జట్టు అత్యుత్తమ కెప్టెన్ల జాబితాలో తనను చేర్చకపోవడంపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కాస్త ఆలస్యంగా స్పందించాడు. తన కెప్టెన్సీ సమయంలో రవిశాస్త్రి క్రికెట్ చూడకపోవడం ఒక కారణం కావచ్చంటూ గంగూలీ చురకలంటించాడు. 'నేను భారత జట్టుకు కెప్టెన్ గా ఉన్న సమయంలో రవిశాస్త్రి క్రికెట్ చూడలేదేమో. కనీసం ఒక మ్యాచ్ ను కూడా చూసి ఉండడు. అందుకే రవిశాస్త్రి అత్యుత్తమ కెప్టెన్ల జాబితాలో నాకు చోటు దక్కలేదు' అని గంగూలీ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
ఈ ఏడాది జనవరిలో రవిశాస్త్రి విడుదల చేసిన టీమిండియా గ్రేట్ కెప్టెన్ల జాబితాలో గంగూలీకి స్థానం ఇవ్వలేదు. దాంతో పాటు గంగూలీ పేరుతో పాటు నడిచే దాదా హోదాను మరో భారత కెప్టెన్ కు కట్టబెట్టేశాడు రవిశాస్త్రి . గత కొన్ని రోజుల క్రిత టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మహేంద్ర సింగ్ ధోనికి దాదా అనే పదాన్ని తగిలించాడు. 'దాదా కెప్టెన్' ధోని అంటూ కితాబిచ్చాడు. 'ఎంఎస్ ధోని సాధించలేనిది ఏదీ లేదు. దాంతో పాటు అతను నిరూపించుకోవాల్సి కూడా ఏమీ లేదు. కోహ్లికి పగ్గాలు అప్పజెప్పడానికి ధోని చేసిన త్యాగం చేశాడు.దాదా కెప్టెన్ కు సలామ్'అంటూ రవిశాస్త్రి పేర్కొన్నాడు. తాజాగా ఈ వ్యాఖ్యలపై ఓ టీవీ షోకు హాజరైన గంగూలీ తనదైన శైలిలో ఎత్తిచూపాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more