ఆస్ట్రేలియాతో ఇక్కడ జరిగిన తొలి టెస్టులో ఘోర ఓటమి తరువాత విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా జట్టు అనేక విమర్శలను ఎదుర్కొంటుంది. ప్రధానంగా అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి(డీఆర్ఎస్)ను భారత జట్టు వినియోగించుకునే విధానమే అనేక సందేహాలకు తెరలేపింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో భారత జట్టు అనవసరపు రివ్యూలను కోరి మూల్యం చెల్లించుకోవడమే ఇక్కడ చర్చకు దారి తీసింది. ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేసి థర్డ్ అంపైర్ నిర్ణయానికి వెళ్లడమంటే ఆటగాళ్లకు ముందు చూపు చాలా అవసరం.
ముఖ్యంగా ఎల్బీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా ఫీల్డ్ అంపైర్లు ఇచ్చే ఎల్బీ డబ్యూ నిర్ణయాలు దాదాపు కచ్చితంగానే ఉండటానికి ఎక్కువ ఆస్కారం ఉంది. మరి ఆ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేసే ముందు బ్యాట్స్మన్ కు కొద్దిగొప్పో పరిజ్ఞానం అవసరం. అది ఎల్బీ అని తెలిసినా తన వికెట్ ను కాపాడుకోవడం కోసం డీఆర్ఎస్ కు వెళితే మాత్రం ఫలితం శూన్యంగానే ఉంటుంది. మొన్నటి ఆసీస్ టెస్టులో జరిగింది కూడా అదే.
భారత రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్లు మురళీ విజయ్, కేఎల్ రాహుల్ లు ఎల్బీ విషయంలో రివ్యూకు వెళ్లి విఫలమయ్యారు. కనీసం ఆ రివ్యూకు వెళ్లే ముందు బంతి వెళ్లే దిశను కనీసం అంచనా వేయకుండానే అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేశారు. ఇక్కడ తమ వికెట్ ను కాపాడుకునే ప్రయత్నమే మన ఓపెనర్లు చేసినట్లు కనబడింది. ఆ రెండు రివ్యూలు తొలి ఆరు ఓవర్లలో కోల్పోవడంతో ఆపై భారత్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ తరువాత చటేశ్వర పూజారా, వృద్ధిమాన్ సాహాలు కూడా ఎల్బీగా అవుటైన తరుణంలో డీఆర్ఎస్ ను ఇక వినియోగించుకునే అవకాశం భారత్ కు లేదు. ఒకవేళ ఆ సమయంలో డీఆర్ఎస్ ఉంటే మాత్రం వారు నిర్ణయాన్ని సవాల్ చేసే అవకాశం దొరికేది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more