భారత్ పర్యటనకు వచ్చిన అస్ట్రేలియాతో ఫూణే వేదికగా జరుగుతున్న తొలిటెస్టులో తొలిరోజున విరాట్ సేన కంగారులపై అధిపత్యాన్ని ప్రదర్శించింది. కాగా, భారత బౌలర్ల ఆధిక్యాన్ని మిచెల్ స్టార్క్ అడ్డుకున్నాడు. పూణే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టును టీమిండియా బౌలర్లు కుప్పకూల్చారు. వరుసగా వికెట్లు తీస్తూ టీమిండియా ఆటగాళ్లు ఆసీస్ ఇన్నింగ్స్ పతనాన్ని శాసించారు. ఈ క్రమంలో ఓపెనర్ రెన్ షా (64) ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. డేవిడ్ వార్నర్ (38) వికెట్ తీయడం ద్వారా ఆసీస్ పతనాన్ని ఉమేష్ యాదవ్ ప్రారంభించాడు.
వార్నర్ వికెట్ తీయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో ఒక బ్యాట్స్ మన్ వికెట్ ఐదు సార్లు తీసిన తొలి భారతీయ బౌలర్ గా రికార్డు నెలకొల్పగా, రెండో అంతర్జాతీయ ఆటగాడిగా ఉమేష్ నిలిచాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్ (27), షాన్ మార్ష్ (16), హ్యాండ్స్ కొంబ్ (22) తీవ్రంగా ప్రతిఘటించే ప్రయత్నం చేసినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. మిచెల్ మార్ష్ (4), మాధ్యూ వేడ్ (8) అవుటవ్వడంతో క్రీజులోకి మిచెల్ స్టార్క్ వచ్చాడు. అప్పటి వరకు భారత బౌలర్ల ఆధిపత్యం నడించింది. ఆ వెంటనే ఒకీఫ్ (0), లియాన్ (0) ను ఉమేష్ అవుట్ చేసి పెవిలియన్ కు పంపాడు. చివరి వికెట్ గా హేజిల్ వుడ్ క్రీజులోకి వచ్చాడు. అతని అండతో స్టార్క్ (14) రెచ్చిపోయాడు.
టాపార్డర్ కు సాధ్యం కాని ఆటతీరును ప్రదర్శించాడు. ఈ క్రమంలో భారీ సిక్సర్లు బాదుతూ అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు స్కోరు బోర్డును ఊహించని విధంగా పరుగులెత్తించాడు. అంతవరకు రాణించిన భారత బౌలర్లు మరోసారి ఎప్పట్లా టాప్ ఆర్డర్ ని కుప్పకూల్చి టెయిలెండర్ ను అవుట్ చేయడంలో బలహీనతను చాటుకున్నారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్లు కోల్పోయి 256 పరుగుల వద్ద తొలిరోజు ఆటను ముగించింది. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ 4 వికెట్లతో రాణించగా, అతనికి అశ్విన్, జడేజా చెరి రెండు వికెట్లతోను, జయంత్ యాదవ్ ఒక వికెట్ తీసి సహకరించారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more