టెస్టు ఫార్మెట్ అ తరువాత తాజాగా లిమిటెడ్ ఓవర్స్ ఫార్మెట్ల కెప్టెన్పీ పగ్గాలను టిమిండియా డాషింగ్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీకి అందించిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తొలిసారిగా ఈ విషయమై స్పందించారు. ముందుగా తన భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నది వెల్లడించిన ఆయన టీమిండియా కెప్టెన్ గా పగ్గాలను అందుకున్న విరాట్ కోహ్లీకి అన్ని ఫార్మాట్లలో జట్టును నడిపించే సత్తా ఉందని కొనియాడాడు. ప్రస్తుతం వున్న టీమిండియా జట్టులో కోనసాగుతున్న అటగాళ్లకు ప్రపంచ రికార్డులను తిరగరాసే సత్తా వుందని చప్పాడు.
వన్డేలకు ఒకరు, టెస్టులకు మరొకరి కెప్టెన్సీతో జట్టుకు ఎలాంటి ఉపయోగం ఉండదని, అన్ని ఫార్మాట్లకు ఒక్క కెప్టెన్ ఉండటం జట్టుకు కలిసొస్తుందని ధోనీ అభిప్రాయపడ్డాడు. ఇక నుంచి కేవలం బ్యాటింగ్ పైనే తాను దృష్టి సారించనున్నట్లు ధోనీ వెల్లడించాడు. ఓవరాల్ గా పదేళ్ల కెప్టెన్సీ జర్నీని ఎంతో ఎంజాయ్ చేశానని, తన సంతోషానికి కారణం అదేనన్నాడు. ఇటీవల కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లీతో జట్టు గురించి చర్చించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పాడు.
టెస్టు ఫార్మాట్ నుంచి కోహ్లీని పరిమిత ఓవర్ల క్రికెట్ లో తీసుకునే నిర్ణయాలపై చర్చించున్నట్లు తెలిపాడు. అన్ని ఫార్మాట్లలో గెలిచే సత్తా ఉన్న ఆటగాళ్లు టీమిండియాలో ఉన్నారని కొనియాడాడు. ముఖ్యంగా ఫీల్డింగ్ పొజిషన్ ఎలా సెట్ చేయాలి.. దీనిపై కోహ్లీ ప్రణాళికలు తెలుసుకుంటానని తన మద్ధతు కచ్చితంగా కోహ్లీకి ఉంటుందని మాజీ కెప్టెన్ ధోనీ పేర్కొన్నాడు. ఈ 15న ఇంగ్లండ్ తో తొలి వన్డేలో కోహ్లీ నేతృత్వంలో ధోనీ ఆడనున్న విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more