ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి వుండటం ఆయన స్టైల్ అని.. టీమిండియా టెస్టు కెస్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. ఇంతకీ ఎవరాయన, ఆయన గురించి విరాట్ ఎందుకు మాట్లాడారు..? అనేగా మీ డౌట్. విరాట్ కోహ్లీ మాట్లాడింది మరెవరి కోసమే కాదు.. టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోణి గురించి. ఆయన ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాడని చెప్పాడు. తాను కూడా ఆయన మార్గంలోనే పయనిస్తున్నానని చెప్పుకోచ్చాడు. అయితే చాలా ఆలోచించిన తరువాతే ఒక కచ్చితమైన నిర్ణయానికి రావాలంటున్నాడు. కొన్ని సందర్భాల్లో నిర్ణయం తీసుకునే ముందు సవాల్ ఎదురవుతుందని, ఆ సమయంలో తీసుకునే నిర్ణయానికి చాలా ధైర్యం కావాలని అభిప్రాయపడ్డాడు. అలా చేస్తేనే నాయకత్వ లక్షణాలను అందిపుచ్చుకుంటారని కోహ్లి పేర్కొన్నాడు.
మహేంద్ర సింగ్ ధోని తర్వాత భారత టెస్టు క్రికెట్ జట్టును సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్న కోహ్లి.. నాయకత్వ లక్షణాలపై మాట్లాడాడు. 'నేను ధోని నుంచి చాలా నేర్చుకున్నాను. ప్రస్తుతం నేను ధైర్యంగా వేసే అడుగులు ధోని నుంచి నేర్చుకున్నవే. నా కెప్టెన్సీ సక్సెస్కు ధోనినే కారణం. ధోని ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నాడు అనే దానిపై అతన్ని దగ్గర్నుంచి చూశా. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తరువాత అది తప్పైనా దానికే కట్టుబడి ఉండాలి. అయితే నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచించాల్సి వుంటుంది. కొన్ని సమయాల్లో స్వతహాగా నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమనిస్తుంది. అప్పుడు చాలా ధైర్యం కావాలి. మనం తీసుకునే నిర్ణయంలో సవాల్ ఎదురైతే దాన్ని సమర్ధవంతంగా స్వీకరించాలి. ఆ తరహా లక్షణాలే కెప్టెన్గా ఎదగడానికి దోహం చేస్తాయి'అని కోహ్లి తెలిపాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more