టీమిండియాలో సత్తెకాలపు సత్తయ్య అంటే ఎవరో మీ అందరికీ తెలుసు. ఆయన మరెవరో కాదు సీనియర్ పేస్ బౌలర్ అశీష్ నెహ్రా. యావత్ ప్రపంచం సోషల్ మీడియాతో, స్మార్ట్ ఫోన్లతో ముందుకు దూసుకువెళ్తున్న క్రమంలో పాత నోకియా ఫోన్ వాడుతున్నానని చెప్పి అందర్నీ అశ్చర్యంలో ముంచిన నెహ్రాను టీమిండియా ఓపెనర్ సత్తెకాలపు సత్తయ్య అని అభివర్ణించారు. అయితే ఈ మాట చెప్పిన మరుసటి రోజునే నెహ్రా సోషల్ మీడియాలో ట్రెడింగ్ కావడం, దీనిపై కూడా రోహిత్ కామెంట్ చేస్తూ,, ఈ విషయాలు సత్తయ్యకు తెలియవని చమత్కరించడం కూడా తెలిసిందే.
అయితే తాజాగా ఈ సత్తెకాలపు సత్తయ్య అదేనండీ మన అశీష్ నెహ్రా నోట టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మాట వచ్చింది, ధోని తాను చూసినా, అడిన కెప్టెన్ల అందరిలోనూ అత్యత్తమ కెప్టెన్ అంటూ నెహ్రా అతడ్ని ఆకాశానికి ఎత్తేసాడు.అజహరుద్దీన్ మొదలుకుని ధోనీ వరకు చాలా మంది కెప్టెన్లతో కలిసి ఆడానని నెహ్రా గుర్తు చేశాడు. వారందరిలోకి ఒత్తిడిని ఎదుర్కోవడంలో ధోనీయే ఉత్తమ కెప్టెన్ అని నెహ్రా పేర్కొన్నాడు. 1999లో టీమిండియా తరపున ప్రాతినిధ్యం వహించేందుకు సెలెక్ట్ అయ్యానని, అప్పటి నుంచి భారత జట్టులోకి వస్తూ పోతూ ఉన్నానని నెహ్రా తెలిపాడు.
1999లో టీమిండియా తరపున ప్రాతినిధ్యం వహించేందుకు సెలెక్ట్ అయ్యానని, అప్పటి నుంచి భారత జట్టులోకి వస్తూ పోతూ ఉన్నానని నెహ్రా తెలిపాడు. టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవడం తన తప్పిదమని నెహ్రా చెప్పాడు. 2009లో కిర్ స్టెన్, 'ధోనీతో కలసి టెస్టుల్లో పునరాగమనం చేస్తావా?' అంటూ తనను అడిగినప్పుడు వారికి సమాధానం చెప్పడంలో నిర్లక్ష్యం ప్రదర్శించానని నెహ్రా అంగీకరించాడు. తన ఆటతీరుపై మీడియా వార్తలను పట్టించుకోనని నెహ్రా తెలిపాడు. తాను మీడియాకు దూరంగా ఉంటానని, తనకు తన ఆటగురించి తప్ప ఇతర విషయాలపై శ్రద్ధ లేదని నెహ్రా స్పష్టం చేశాడు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more