టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ తో ఈ నెల 23న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో తాను ఆడిన షాట్ విన్నింగ్ షాట్ అనుకున్నానని, కానీ విక్కట్ చేజారుతుందని భావించలేదని బంగ్లాదేశ్ ఆటగాడు ముష్ఫికర్ రహీం అవేదన వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ లో తన అట తీరుపై ఆయన చాలా బాధపడుతున్నాడు. తాను చాలా నిర్లక్ష్యంగా షాట్ ఆటడం వల్లే భారత్ చేతిలో ఓటమి పాలయ్యామని చెప్పాడు. జట్టు ఓటమికి తానే కారణమని తనను క్షమించాలని దేశ అభిమానులను కోరాడు.
తాను ఆ విధంగా ఔట్ కాకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. విన్నింగ్ షాట్ కోట్టి అక్కడున్న ఉత్కంఠ వాతావరణానికి బ్రేక్ కల్పిద్దామని అనుకున్నాను కానీ, అలా జరుగుతుందని తాను ఊహించలేదన్నాడు. తాను ఔటవ్వక ముందు రెండు బంతులను బౌండరీలను తరలించిన తర్వాత ఆ ఒక్క షాట్ జట్టు ఓటమికి దారితీసిందన్నాడు. తాను డీప్ సైడ్ ఆడిన షాట్ సిక్స్ అయింటే... అది గ్రేట్ షాట్ అయి ఉండేదని, చాలా మద్ధతు లభించేందని ముష్ఫికర్ తన మనసులో మాట బయటపెట్టాడు.
ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వ్యాఖ్యలను తన ఫేస్ బుక్ పేజీలో షేర్ చేశాడు. బిగ్ షాట్ ఆడి మ్యాచ్ ను ముగించాలి. అయితే ఆ సమయంలో చేతిలో వికెట్లు ఉన్నాయా, లేదా అనేది గుర్తుంచుకోవాలి. ఆ బ్యాట్స్ మన్ ఒకవేళ ఔటయిన తర్వాత వచ్చే ఆటగాడు మ్యాచ్ ఫినిష్ చేస్తాడని భావిస్తేనే షాట్ ఆడేందుకు ప్రయత్నించాలి' అని గతంలో ధోనీ కామెంట్లను షేర్ చేశాడు. అయితే తాను ఔటైన తర్వాత తన సహచరుడు కూడా అదే తీరుగా ఆడటం కూడా ఓటమికి మరింత కారణంగా మారిందని ముష్ఫికర్ రహీం వివరణ ఇచ్చాడు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more