టీమిండియా తరపున టెస్టులో అత్యధిక వ్యక్తిగత పరుగులు నమోదు చేసిన ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్. 2008 లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో 319 పరుగులు చేసిన సెహ్వాగ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. కాగా, భారత తరపున టెస్టుల్లో సెకెండ్ బెస్ట్(309 పరుగులు ), థర్డ్ బెస్ట్(293 పరుగులు) కూడా సెహ్వాగ్ పేరిటే ఉండటం మరో విశేషం. అయితే తాను టెస్టుల్లో నమోదు చేసిన 319 పరుగుల రికార్డును తన కుమారులు ఏ స్థాయిలోనైనా అధిగమిస్తే వారికి ఫెరారీ కారు బహుమతిగా ఇస్తానని సెహ్వాగ్ స్పష్టం చేశాడు.
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానం వేదికగా జరుగుతున్న చివరిదైన టెస్టు మ్యాచ్ సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్ తన కుమారులకు ఓ మంచి బంపర్ ఆపర్ ను ప్రకటించాడు. ఏ తండ్రైనా తన కుమారులు చదవులో రాణించాలని.. వారికి చిన్న చిన్న ఆశలు కల్పిస్తారు. కనీసం వాటికోసమైనా వారు చదువులో రాణిస్తారని తల్లిదండ్రుల నమ్మకం. అలానే ఒక క్రికెటర్ గా తన కుమారులు కూడా తన మాదిరిగా క్రికెట్ లో ఱానించాలని మన క్రికెటర్లు ఆశపడటంలో తప్పులేదు. అలాంటిదే ప్రస్తుతం జరిగింది. తన ఇద్దరు కుమారులలో ఎవరైనా తన అత్యధిక స్కోరును ఏ స్థాయిలోనైనా బద్దలు కోడితే వారికి ఫెరారీ కారును బహుమానంగా అందిస్తానని సెహ్వాగ్ ప్రకటించారు.
ఇలీవల అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన వీరేంద్ర సేహ్వాగ్.ను ఇవాళ ఢిల్లీ ఫెరోజ్ షా స్టేడియంలో బిసిసిఐ సన్మానించింది. ఈ కార్యక్రమం గురించి ముందుగానే సెహ్వాగ్ కు సమాచారం అందించడంతో ఆయన తన కుటుంబసమేతంగా వచ్చారు. మ్యాచ్ ప్రారంభానికి ముందే అయనను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఘనంగా సన్మానించింది. అనంతరం సెహ్వాగ్ తన కుటుంబంతో కలిసి మ్యాచ్ ను వీక్షించాడు. ఈ క్రమంలోనే సెహ్వాగ్ తో క్రికెట్ వ్యాఖ్యాత హర్షా బోగ్లే ముచ్చటించాడు. 'ఆ రికార్డు నెలకొల్పడం ఆనందంగా ఉంది. 319 పరుగుల రికార్డును నా కుమారులు ఏ స్థాయిలో బద్ధలు కొట్టినా వారికి ఫెరారీ కారు కానుకగా ఇస్తా' అని సెహ్వాగ్ తెలిపాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more