ఒకే ఒక్క విజయం కోసం అత్రుతగా ఎదురుచూస్తున్న టీమిండియా క్రికెట్ జట్టుకు ఆ అవకాశం అందివచ్చింది. బలమైన సెంటిమెంట్ వున్న ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో విజయాన్ని అందుకుని రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉరకలేస్తుంది. ఇండోర్ స్టేడియం సెంటిమెంట్ మళ్లీ గెలిచింది. టీమిండియా జట్టు కెప్టెన్ ధోని కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించగా, విజయం కోసం ఎదురుచూస్తున్న టీమిండియా గెలుపును అస్వాధించింది. బ్యాటింగ్ లో అంతగా రాణించలేకపోయినా.. స్వల్ప స్కోరును బోర్డుపై పెట్టిన టీమిండియా సమిష్టి కృషితో విజయాన్ని అందుకుంది.
ఇండోర్ వన్డేలో 248 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా లక్ష్యాన్ని అందుకోకుండానే ఓడిపోయింది. మరో ఆరు ఓవర్ల రెండు బంతులు మిగిలివుండగానే.. 43.4 ఓవర్లలో 225 పరుగులకే ఆలౌటైంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ను ఆరంబించగానే ధాటిగా ఆడటం ప్రారంభించింది. ఒక ధశలో రెండో వన్డేను కూడా తమ ఖాతాలో వేసుకుంటారేమోనన్న అందోళన భారత అభిమానుల్లో కనిపించింది. క్రమంగా విక్కెట్లు తీయడంతో డుప్లెసిస్, డివిలర్స్ ఔటవ్వడంతోనే ఇక మ్యాచ్ పై అభిమానుల్లో ఆశలు చిగురించాయి. ఇండోర్ సెంటిమెంట్ కూడా నిలిచింది. భువనేశ్వర్ కుమార్, అక్షర్ పటేల్ చెరి మూడు వికెట్లు సాధించారు. 22 పరుగులతేడాతో గెలుపొందిన భారత్ 1-1తో సిరీస్ సమం చేసింది.
అంతకుముందు భారత్ సౌతాఫ్రికా ముందు 248 పరుగుల విజయలక్ష్యం ఉంచింది. రెండో వన్డే మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. కెప్టెన్ ధోనీ చేసిన 92 పరుగులే అత్యధిక స్కోరు. మిగతా ఆటగాళ్లందరూ తక్కువ స్కోరుకే అవుటయ్యారు. రోహిత్ శర్మ మూడు పరుగులకే పెవీలియన్ దారి పట్టాడు. శిఖర్ ధావన్ 23, కోహ్లీ 12, అక్షర్ పటేల్ 13, హర్భజన్ సింగ్ 22, రహానే 51 పరుగులు చేశారు. ధోనీ 86 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 92 పరుగులు చేశాడు.
అజింకా రహానే-51, శిఖర్ ధావన్-23, హర్భజన్సింగ్-22, భువనేశ్వర్ కుమార్-14, అక్షర్ పటేల్-13, విరాట్ కోహ్లీ-12, యాదవ్-4, రోహిత్ శర్మ-3, రైనా-0 పరుగులు చేసి ఔటయ్యారు. కాగా ధోనీ-92 పరుగులు, మోహిత్శర్మ-0 పరుగులతో నాటౌట్గా నిలిచారు. సౌతాఫ్రికా బౌలర్లలో స్టెయిన్-3, తాహీర్-2, మోర్కెల్-2, రబడ-1 వికెట్ను పడగొట్టారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more