అవును.. 2011 వరల్డ్ కప్ తర్వాత రిటైర్ మెంట్ ప్రకటించిన క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇన్నాళ్లూ పక్కన పెట్టేసిన తన బ్యాటుకు మరోసారి పని చెప్పబోతున్నాడు.. మైదానంలో దిగి తన క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించనున్నాడు.. ప్రత్యర్థి ఆటగాళ్లను ముచ్చెమటలు పట్టించేందుకు సన్నద్ధమవుతున్నాడు. అయితే.. ఈసారి ఆయన క్రీజులోకి అడుగుపెడుతోంది ఇండియా క్రికెట్ జట్టు కోసం కాదులెండి.. అమెరికాలో ‘జెంటిల్మన్ గేమ్’ను ప్రాచుర్యం చేయడం కోసమట!
‘జెంటిల్మన్ గేమ్’గా ప్రసిద్ధిగాంచిన క్రికెట్ అంటే నిన్నటిదాకా ప్రపంచంలోని చాలా దేశాలకు అంతగా ఆసక్తి ఉండేది కాదు. అయితే కాలం మారుతోంది. ఇతర దేశాలు కూడా క్రికెట్ పట్ల మక్కువ పెంచుకుంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికా కూడా ఇందుకేమీ మినహాయింపు కాదు. త్వరలో ఆ దేశం కూడా క్రికెట్ ఆడే దేశాల చెంత చేరనుంది. ఇందుకోసం ఆ దేశం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. అయితే.. క్రికెట్ పై ఆ దేశ పౌరులకు ఆసక్తి, అవగాహన అంతగా లేదు కాబట్టి.. ముందుగా ఆ పనిచేసేందుకు అమెరికా నడుం బిగించింది. ఈ నేపథ్యంలనే తమ దేశంలో క్రికెట్ కు ప్రాచుర్యం కల్పించేందుకు అమెరికా భారీ సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెలలో న్యూయార్క్, లాస్ ఏంజెలిస్, హోస్టన్ లలోని బేస్ బాల్ స్టేడియంలు క్రికెట్ మైదానాలుగా మారనున్నాయి.
ఇక ఇప్పటికే క్రికెట్ కు వీడ్కోలు పలికిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సహా ప్రపంచ క్రికెట్ లో దిగ్గజాలుగా ఖ్యాతిగాంచిన 25 మంది ఈ స్టేడియంలలో క్రికెట్ ఆడనున్నారు. టీ20 ఫార్మాట్ లో జరగనున్న ఈ మ్యాచ్ ల్లో సచిన్ తో పాటు షేన్ వార్న్, వసీం అక్రం, మైఖేల్ వాన్, మహేళ జయవర్ధనే, బ్రియన్ లారా, జాకస్ కలిస్ తదితర 25 మంది దిగ్గజాలు పాల్గొంటారట. వచ్చే నెల 7న న్యూయార్క్ లో, 11న హోస్టన్ లో, 14న లాస్ ఏంజెలిస్ లో మ్యాచ్ లు జరగనున్నాయి. ఇలా ఈ విధంగా సచిన్ మరోసారి బ్యాట్ పట్టుకుని మైదానంలో దిగేందుకు సన్నద్ధమవుతున్నాడు.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more