యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన 5 మ్యాచుల టెస్టు సిరీస్ ను ఆస్ట్రేలియా జట్టు ఘోరంగా పరాజయం పాలయ్యింది. దీంతో ఆ జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆ జట్టు అంత ఘోరంగా విఫలమవడానికి గల కారణాలను ఎత్తిచూపుతూ క్రీడాభిమానుల నుంచి మాజీలు, విశ్లేషకులు మండిపడుతున్నారు. జట్టులో సమిష్టితత్వం లోపించడం ఓ కారణమైతే.. ఆటగాళ్లు తమతోపాటు భార్యలను, గర్ల్ ఫ్రెండ్స్ ను తీసుకెళ్లడం మరో ప్రధాన కారణమని తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా.. ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు తమ భార్యలను విదేశీ టూర్లకు తీసుకెళ్లి.. జట్టుతో కాకుండా వేరుగా వుండటమే ఓటమికి కారణమని ఓ డైలీ పేర్కొంది.
ఇలా ఈ విధంగా వార్తలు వస్తుండటంతో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ మైకేల్ క్లార్క్ తీవ్రంగా మండిపడ్డాడు. జట్టు ఓటమికి భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ ను వెంట తీసుకెళ్లడం కారణమని వస్తున్న వార్తల్ని ఖండించాడు. అసలు అందులో ఏమాత్రం వాస్తవం లేదన్నాడు. పైగా.. తాను చేసిన 10 టెస్టు సెంచరీలు భార్యను వెంట తీసుకెళ్లి చేసినవేనంటూ కౌంటరిచ్చాడు. తాను జట్టుతో ఉండకుండా ఆఫ్ ఫీల్డ్ రిలేషన్స్ కే ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొనడం తగదన్నాడు. ‘ప్రతీరోజు ఆట ముగిసిన తరువాత ఎలా ఆడాం? ఎలా ఆడాలి?అనే దానిపై జట్టు సభ్యులు అంతా కలిసి చర్చించుకుంటామ’ని క్లార్క్ స్పష్టం చేశాడు. ప్రతిఒక్క ఆటగాడు తన జట్టు కోసమే క్రికెట్ ఆడతాడని, గెలుపుకోసం ఎంతో శ్రమిస్తాడని, వ్యక్తిగత సమస్యలు ఎన్ని వున్నప్పటికీ, అవన్ని మరిచి గెలుపే ధ్యేయంగా మైదానంలో అడుగుపెడతాడని క్లార్క్ అన్నాడు.
ఇదిలావుండగా.. యాషెస్ సిరీస్ నాల్గో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో ఓటమి పాలై.. సిరీస్ ను 3-1 తేడాతో కోల్పోయింది. ఈ విధంగా ఘోరంగా పరాజయం కావడంతో నిరాశకు గురైన క్లార్క్ .. తన టెస్టు కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. తాను యాషెస్ లో ఐదో టెస్ట్ అనంతరం టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు చెప్పనున్నట్లు ప్రకటించాడు.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more