ప్రపంచకప్ లో భారత్ సెమీస్ వరకు వెళ్లి ఒత్తిడి తట్టుకోలేక ఇంటికి వెనుదిరడంతో.. టీమ్ మెంబర్లలో ఆత్మవిశ్వాసం నింపే పనిని జట్టు కోచ్ సరిగ్గా నిర్వహించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో భారత టీమ్ కు కోచ్ గా సౌరవ్ గంగూలీని నియమించాలని బీసిసిఐ నిర్ణయానికి వచ్చిందా..? అంటే అవుననే సమాధానాలే అధికంగా వినబడుతున్నాయి. ఈ మేరకు ఇవాళ బీసిసిఐ చైర్మన్ జగ్ మోహన్ ధాల్మియాతో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భేటీ అయ్యారు. అయితే ఈ విషయాన్ని ఆయన అంగీకరించినప్పటికీ వారి భేటీకి సంబంధించిన విషయాలను వెల్లడించలేదు. టీమిండియా ప్లేపర్ల్ గా, స్టేట్స్ మెన్ గా గంగూలీతో చర్చించానని సమాధానాన్ని దాటవేశారు.
ప్రస్తుతం భారత టీం కోచ్గా వున్న డంకన్ ఫ్లెచర్ పదవీ కాలం ముగియడంతో.. ఈ స్థానంలో ఎవరు వస్తారోనన్న ఊహగానాలపై రోజుకో రకమైన కథనాలు వెలుగుచూస్తున్నాయి. తొలుత భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఈ స్థానాన్ని భర్తీ చేస్తారని కథనాలు, ఆ తరువాత టీమిండియా మరో కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ ఈ స్థానాన్ని భర్తీ చేస్తారన కథనాలు వెలువడ్డాయి. తాజాగా ఈ స్థానానికి తాను పోటీలో వున్నానని భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా బరిలోకి దిగడంతో.. ఈ దిగ్గజ త్రయం నుంచి కోచ్ గా ఎవరిని ఎంపిక చేస్తారన్న అంశం ఉత్కంఠకు దారి తీస్తోంది.
అయితే తాజాగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో సౌరవ్ గంగూలీ భారత జట్టు కోచ్ గా మార్గనిర్ధేశకత్త్వం చేస్తారని బలమైన వార్తలను వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తనను వరించనున్న బీసిసిఐ డైరెక్టర్ పదవిని కూడా వదులకోనేందుకు సిద్దపడినట్లు సమాచారం. మరోవైపు ఈ మేరకు సౌరవ్ గంగూలీని భారత జట్టు కోచ్ గా ఎంపిక చేయాలని బిసిసిఐ చైర్మన్ జగ్ మోహన్ దాల్మియాపై పశ్చిమ బెంగా క్రికెట్ బోర్డు నుంచి కూడా తీవ్రస్థాయిలో ఒత్తడి వచ్చినట్లు సమాచారం. అయితే ఈ నెల 26 బిసిసిఐ సమావేశం అనంతరం టీమిండియాకు కోచ్ గా ఎవరిని ఎంపిక చేస్తారో తెలియనుంది. కాగా కోచ్ ను ఎంపిక చేసే బాధ్యతలు భారత్ మాజీ కెప్టెన్ సునిల్ గవాస్కర్ ప్యానెల్ పై వున్నాయని సమాచారం.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more