భారత్ తో టెస్టు సీరిస్ లో 2-0తో విజయం సాధించిన అస్ట్రేలియా జట్టును ఫిలిప్ హ్యూస్ ఆకస్మిక మరణం మనో వేదనకు గురిచేస్తోంది. భారత్ తో సీరిస్ ప్రారంభానికి ముందు దేశవాలీ క్రికెట్ ఆడుతున్న ఫిలిఫ్ హ్యూస్ బౌన్సర్ బంతిని ఫుల్ షాట్ గా మాలచడంలో విఫలం చెంది తలకు భలమైన గాయంతో ఆస్పత్రిలో చేరి.. కోమాలోకి జారుకుని మరణించిన ఘటన అస్ట్రేలియా క్రీడాకారులను వెంటాడుతోంది. అంతేకాదు మూడో టెస్టు కోసం సమాయత్తం అవుతున్న సమయంలో అసీస్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్. జేమ్స్ పాటిన్ సన్ వేసిన బౌన్సర్ బంతి జోరుగా వచ్చి హెల్మెట్ పై తగిలింది. దీంతో ఆయన అక్కడే కిందపడ్డాడు. వాట్సన్ కోలుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నా.. ఇలాంటి గాయాలు తగిలి ప్రాణం మీదకు తెచ్చుకోవడం ఎందుకని వారి మదిన ప్రశ్నలు తొలుస్తున్నాయి
ఈ ఆందోళనలో భాగంగానే ఆస్ట్రేలియా ఓపెనర్ క్రిస్ రోజర్స్ అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. సొంతగడ్డపై భారత్ తో చివరి టెస్టు ఆడిన ఆయన ఆదే తన ఆఖరి టెస్టు ఆని ప్రకటించడానికి కారణం కూడా ఫిలిఫ్ హ్యూస్ ఘటన వెంటాడటమేనని తేల్చిచెప్పాడు. భారత్తో సిడ్నీ టెస్టే స్వదేశంలో తన చివరి మ్యాచ్ అని సిరీస్ మధ్యలో రోజర్స్ ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది. ఈ అనూహ్య నిర్ణయానికి ఓ కారణం ఉంది. ‘బ్రిస్బేన్లో భారత్తో రెండో టెస్టు తొలి రోజు రోహిత్ శర్మ స్వీప్ షాట్ ఆడాడు. అప్పుడు తాను ఫార్వర్డ్ షార్ట్లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్నాని... బంతి రాగానే తల వెనక్కి తిప్పానని. అది వచ్చి హెల్మెట్ మీదే మెడ భాగంలో తగిలిందని చెప్పుకోచ్చాడు.
సరిగ్గా హ్యూస్కు బంతి తగిలిన ప్రదేశం కూడా అదేనన్నాడు. దీంతో తాను ఒక్క క్షణం షాక్కు గురయ్యానన్నాడు. అయితే అదృష్టవశాత్తు తనకు ఏం కాలేదన్నాడు. ఆ రోజు రాత్రి చాలాసేపు తాను గాయం గురించే ఆలోచించానని, 37 ఏళ్ల తాను ఇంకా ఎంతకాలం క్రికెట్ ఆడగలనో తెలియదని అందుకే టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించానన్నాడు. యాషెస్ ఆడాలనే కల తనకు మిగిలుందని అందచేత ఇంగ్లండ్ వెళ్లి ఆ టోర్నీ ఆడాలనుకుంటున్నాన్నాడు. ఈ లోగా స్వదేశంలో టెస్టులూ లేని కారణంగా సొంతగడ్డపై ఆఖరి మ్యాచ్ అని ప్రకటించానని చెప్పాడు. ఈ నిర్ణయం తీసుకునే ముందు చాలా మంది సన్నిహితులతో మాట్లాడి చర్చించానన్నాడు. తమ కళ్ల ముందు చెలరేగి ఆడుతున్న హ్యూస్.. గాయంతో కొన్ని రోజుల్లోనే విగత జీవిగా మారడం.. అనంతవాయువుల్లో కలసిపోవడంతో ఆ ఘటన అస్ట్రేలియన్ క్రీడాకారులను వెంటాడుతుంది. అదీకాక రోహిత్ శర్మ స్వీప్ షాట్ ఓ క్రికెటర్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకునేలా చేసిందన్న మాట.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more