ఐపీఎల్ మ్యాచుల నేపథ్యంలో తన బౌలింగ్ సత్తాను చాటుకుని టీమిండియా జట్టులో స్థానం సంపాదించుకున్న ఫాస్ట్-బౌలర్ ఉమేశ్ యాదవ్... మహేంద్రసింగ్ ధోనీ కంటే కోహ్లీయే చాలా బెస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ కెప్టెన్’షిప్’లో జట్టులో వుండే కుర్రాళ్లంతా స్వేచ్ఛగా వుండగలమని... అదే ధోనీ సారథ్యంలో అలా కుదరదని బహిరంగంగా చెప్పేశాడు. టీమిండియా జట్టుకు కోహ్లీలాంటి కెప్టెన్ వుంటేనే చాలామంచిదన్న అభిప్రాయాన్ని కూడా అతడు వెల్లడించినట్లు సమాచారం! అయితే చివరగా తాను చెప్పిన మాటల్ని అర్థం చేసుకోవద్దని, ధోనీ కూడా మంచోడేనంటూ బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు!
ఇటీవలే కోహ్లీ సారథ్యంలో టీమిండియా జట్టు శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్’ను భారత్ 5-0 క్లీన్’స్వీప్ చేసిన సంగతి తెలిసిందే! ఇక ధోనీ అనారోగ్యం కారణంగా ఆస్ట్రేలియాలో తొలిటెస్టుకు కూడా అతడే కెప్టెన్’గా వ్యవహరించనున్నాడు. అతడు సారథ్యంలో వున్నప్పుడు అతనితో కలిసి ఆడిన బౌలర్ ఉమేశ్ యాదవ్.. అతని వ్యక్తిత్వం ఎటువంటిదో వివరించాడు. ధోనీతో పోల్చుకుంటే కోహ్లీ చాలా ఫ్రెండ్లీగా వుంటాడని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. ఈ నేపథ్యంలో అతడు మాట్లాడుతూ.. ‘‘విరాట్ కోహ్లీ సారథ్యంలో వాతావరణం మొత్తం భిన్నంగా వుంటుంది. అతడు కుర్రాళ్లతో ఒకడిగానే వుంటాడు. ఒకే వయసువాళ్లం కాబట్టి అతడితో మాట్లాడటం, సమస్యల గురించి చర్చించడం చాలా సులభమవుతుంది’’ అని పేర్కొన్నాడు. అయితే తాను చెప్పిన ఈ మాటలకు తప్పుగా అర్థం చేసుకోవద్దని.. ధోనీ వ్యక్తిగత్వం కూడా మంచిదేనని అన్నాడు.
ఈ నేపథ్యంలోనే ధోనీ గురించి కూడా మాట్లాడుతూ.. ‘‘ధోనీ భాయ్ కూడా మాట్లాడేందుకు పూర్తి స్వేచ్ఛనిస్తాడు. కానీ ఆయన చాలా సీనియర్ ఆటగాడు కాబట్టి.. అతడి దగ్గర మేం కాస్త జాగ్రత్తగా వుంటాం. అతనితో ఏమైనా మాట్లాడాలన్నా ముందుగానే పునరాలోచన చేసుకుని వెళ్తాం. అయితే కోహ్లీతో చాలా సరదాగా వుంటాం. అతడితో ఏదైనా మాట్లాడొచ్చు’’ అంటూ వారిద్దరు తమ మనస్తత్వాలు ఎలా వుంటాయోనని క్లారిఫికేషన్ ఇచ్చుకున్నాడు. కేవలం పేస్’పైనే కాకుండా నియంత్రణపై కూడా దృష్టి పెట్టానని పేర్కొంటున్న ఇతగాడు.. ఇండియా జట్టును గెలిపించడంలో తనవంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నాడు.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more