madhukeshwara temple mythological history | lord mahashiva temples

Madhukeshwara temple mythological history lord mahashiva special story

madhukeshwara temple, madhukeshwara temple history, madhukeshwara temple story, madhukeshwara temple special story, madhukeshwara temple mythological story, telugu mythological stories, lord shiv temples, telugu hindu temples, mukhalingam village, srikakulam district

madhukeshwara temple mythological history lord mahashiva special story : The Historical story of madhukeshwara temple in which lord mahashiva located. This temple in srikakulam district mukhalingam village.

మహాశివుడు వెలసిన మధుకేశ్వరాలయం విశేషాలు

Posted: 04/11/2015 07:48 PM IST
Madhukeshwara temple mythological history lord mahashiva special story

భారతదేశంలో కొలువైవున్న అత్యంత పురాతన దేవాలయాల్లో ‘మధుకేశ్వరాలయం’ ఒకటి! శ్రీకాకుళం జిల్లాలో వంశధారానదికి ఎడమ గట్టున వుండే ముఖలింగం గ్రామంలో ఈ ఆలయం వుంది. మహాశివుడు కొలువై వున్న ఈ ఆలయానికి ‘మధుకేశ్వరుడు’ అనే పేరు రావడానికి ఓ పురాణకథనం వుంది.

స్థలపురాణం :

పూర్వం ఒకనాడు హిమాలయాలమీద ‘వైష్ణవయాగం’ జరిగింది. ఆ యాగాన్ని చూసేందుకు గంధర్వరాజైన చిత్రగ్రీవుడు తన గంధర్వ గణాలతో వచ్చాడు. అలాగే.. ఆ హిమాలయాలమీద వుండే శబరకాంతలు కూడా ఆ యాగం చూడడానికి వచ్చారు. అప్పుడు శబరకాంతల సౌందర్యాన్ని చూసిన గంధర్వులు కామవశీభూతులయ్యారు. ఆ సమయంలో అక్కడే వున్న వామదేవ మహర్షి వారిలో రగులుతున్న కామాన్ని గ్రహించి ఒక్కసారిగా కోపాద్రిక్తుడయ్యాడు. అప్పుడు ఆయన కోపంతో.. ‘సభామర్యాదను అతిక్రమించిన దోషానికి మీరంతా శబరజాతిలో జన్మించండి’ అని గంధర్వులు శపించాడు. అతని శాపంతో గంధర్వులంతా శబరులుగా జన్మించారు. ఇక వారి నాయకుడైన చిత్రగ్రీవుడు శబర నాయకుడుగా జన్మించాడు.

Madhukeshwara-story-news

చిత్రగ్రీవుడికి ఇద్దరు భార్యలు వుండేవారు. ఒక భార్య పేరు చిత్తి కాగా.. రెండవ భార్య పేరు చిత్కళ. ఈమె శివభక్తురాలు. వీరిద్దరికీ ఒక్క క్షణం పడేదికాదు. ప్రతిసారీ ఏదో ఒక విషయంపై కీచులాడుకునేవారు. ఈ క్రమంలోనే ఒకరోజు చిత్తి తన భర్త చిత్రగ్రీవుడి దగ్గరకు చేరి.. ‘నీతో ఉంటే నేనైనా ఉండాలి... లేదా చిత్కళైనా ఉండాలి. ఏదో ఒకటి తేల్చి చెప్పు’ అని నిలదీసింది. దీంతో అయోమయంలో పడిపోయిన అతడు.. పట్టపురాణి అయిన చిత్తిని వదులుకోలేక తన రెండవరాణి అయిన ఛిత్కళను వదులుకోవడానికి సిద్ధమవుతాడు. అప్పుడు అతడు ఛిత్కళను పిలిచి... ‘మన వాకిలిలో వున్న ఇప్పచెట్టు కొమ్మలు రెండు వంచి, రాలిన పువ్వులు ఏరుకుని, వాటిని అమ్ముకుని బతుక్కో’మని అన్నాడు. అది విన్న ఛిత్కళ తీవ్ర మనోవేదనకు గురవుతుంది. అయితే మహాసాధ్వి అయిన ఆమె తన భర్త మాటకు ఎదురు చెప్పలేక, అతను చెప్పినట్లుగానే జీవితాన్ని కొనసాగించేది.

అయితే ఆమె శివభక్తురాలు కనుక శివానుగ్రహం వల్ల రాలిన పువ్వులు బంగారు పువ్వులుగా మారిపోయేవి. చిత్కళ ఆ బంగారు పువ్వులను అమ్ముకుంటూ కాలం గడిపేది. ఈ సంగతి తెలుసుకున్న చిత్తి అసూయ చెంది చిత్కళతో గొడవకు దిగింది. అప్పుడు విసుగు చెందిన చిత్రగ్రీవుడు... సవతుల గొడవకు ఆ ఇప్పచెట్టే కారణమని తలచి, ఆ చెట్టును నరకడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు మహాశివుడు రౌద్రాకారంతో ఆ చెట్టు ముందు ప్రత్యక్షమయ్యాడు. అది చూసి చిత్రగ్రీవుడు ఒక్కసారిగా మూర్ఛబోయాడు. అప్పుడు అతడు ఈ వివాదానికి కారణం చిత్కళయేనని గ్రహించి.. అతనితోపాటు శబరులంతా కలిసి చిత్కళను చంపడానికి సిద్ధబడ్డారు. అప్పుడు మహాశివుడు వారి ముందు ప్రత్యక్షమై శబరరూపులైన ఆ గంధర్వులకు శాపవిముక్తి అనుగ్రహించాడు. ఆ విధంగా మధూక వృక్షంలో సాక్షాత్కరించిన మహాశివుడే మధుకేశ్వరుడుగా వెలసాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : madhukeshwara temple  lord shiva temples  telugu mythological stories  

Other Articles

  • Special story on tadbund hanuman temple

    స్వయంభువుడు తాడ్ బండ్ వీరాంజనేయుడు

    May 31 | భాగ్యనగరంలో ఏటా నిర్వహించే హనూమాన్ జయంతి వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారీ సేవలతో మొదలయ్యే ఈ వేడుకలు శోభాయత్రతో ఘనంగా ముగుస్తాయి.  ఏటా చైత్ర పౌర్ణమిరోజు హన్ మాన్ (చిన్నజయంతి),... Read more

  • Vemulawada is a paradise

    భూతల స్వర్గం... వేములవాడ

    Jan 13 | అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు, తప్పని పరిస్థితుల్లో ఋషిని హత్యచేసాడు... ఇందుకు ఎంతో పశ్చ్యాతాపపడ్డాడు... ఎలా అయిన "బ్రహ్మ" హత్యా దోషాన్ని పోగొట్టుకోవాలి అనుకున్నాడు... అన్ని ప్రాంతాలు సందర్శిస్తూ, అన్ని ఆలయాలలో పూజలు చేయ్యసాగాడు... కానీ,... Read more

  • Inavolu mallikarjuna swamy temple history indian hindu gods lord shiva mythology

    అత్యంత పురాతనమైన మల్లికార్జున ఆలయ విశేషాలు

    Nov 24 | భారతదేశంలో వెలిసిన అత్యంత పురాతనమైన ఆలయాల్లో... వరంగల్ జిల్లాలోని అయినవోలు గ్రామంలో వెలిసిన మల్లికార్జున స్వామివారి దేవాలయం ఒకటి. విశాల ప్రాంగణంలో ఎంతో అద్భుతంగా వెలిసిన ఈ ఆలయం.. కాకతీయుల కాలంలో నిర్మింపబడింది. కాకతీయ... Read more

  • Somanth temple historical story lord shiva mythological backgrounds

    మహాశివుని ‘సోమనాథ్’ ఆలయం విశేషాలు

    Nov 21 | సోమనాథ్ క్షేత్రం.. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్రా ప్రాంతంలోని వెరావల్‌లో వుంది. దీనిని ‘ప్రభాస తీర్థం’ అని కూడా పిలుస్తారు. స్థలపురాణం ప్రకారం.. ఈ ఆలయాన్ని చంద్రుడు... Read more

  • Mattewada bhogeswara swamy temple historical story kakatiya dynasty

    మట్టెవాడలో కొలువైవున్న ‘భోగేశ్వరాలయం’ విశేషాలు

    Nov 19 | ఆధ్యాత్మిక, చారిత్రాత్మక సంపదగల భారతదేశంలో కొన్ని ఆలయాలు చరిత్రపుటలో మరుగునపడుతున్నాయి. ఒక్కసారి వాటిని పరిశీలిస్తే.. నమ్మలేని అద్భుత గాధలు తెలుసుకోవచ్చు. అలాంటి ఆలయాల్లో ‘భోగేశ్వరాలయం’ ఒకటి. కాకతీయ సామ్రాజ్యంలో నిర్మించబడిన ఈ ఆలయం.. వరంగల్... Read more