హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని స్పితి లోయలో ఉన్న గుహల సముదాయమే టాబో గ్రామం. సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం ఈ టాబో గ్రామాన్ని నిర్మించారు. ఈ గుహల సముదాయంలో 9 దేవాలయాలు, 23 ఛార్టేన్ లతో పాటు సన్యాసుల, సన్యాసినుల నివాసాలు ఉన్నాయి. దీనిని ‘హిమాలయాలలోని అజంతా’ అని పిలుస్తారు.