రాష్ట్ర విభజన పై కేంద్రంలో దూకుడు పెంచింది. అయితే సీమాంద్ర నాయకులు మాత్రం హైదరాబాద్ పై ద్రుష్టి పెట్టారు. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చెయ్యాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో హైదరాబాద్ విషయం పై తెలంగాణ ప్రాంతానికి చెందిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ త్రీవంగా స్పందించారు. తాము దద్దమ్మలం కాదని దానం నాగేందర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తుంటే చూస్తూ ఊరుకునే దద్దమ్మలం కాదని ఆయన స్పష్టం చేశారు.
యూటీ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. సీమాంధ్ర నాయకులు కొందరు తమ స్వార్థం కోసం హైదరాబాద్ ను యూటీ చేయాలంటున్నారని ఆరోపించారు. తమ అభిప్రాయాలను పట్టించుకోకుండా కేంద్రం ముందుకు వెళితే తామేం చేయాలో తమకు తెలుసని చెప్పారు.
హైదరాబాద్ పై ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదని అంతకుముందు దానం హెచ్చరించారు. యూటీ అంటే అధికారాలన్నీ కేంద్రం చేతిలోకి వెళ్తాయన్నారు. కేంద్రం చేతిలో అధికారం ఉంటే ప్రజాప్రతినిధులుగా తాము ఏమి చేయాలని ప్రశ్నించారు. కీలక అధికారాలు కేంద్రం పరిధిలో ఉంటే తమకు సమ్మతం కాదన్నారు.
డ్రగ్స్ రాకెట్ గ్యాంగ్
నగరంలోని భారీ డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టయింది. 11 కిలోల నిటాపినామిన్ డ్రగ్ను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్లో తయారు చేసి మలేషియాకు తరలిస్తున్న మురళీ, కమ్మ శ్రీను, రాజు, శివ, లక్కీసింగ్ లను పోలీసులు అరెస్టు చేశారు.
వీరి వద్ద నుంచి రూ. 15 లక్షలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. హవాలా పద్ధతిలో చెల్లింపులు ఉండేవని పోలీసులు కనుగొన్నారు. చెన్నై దావూద్తో వీరికి సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జీడిమెట్లలోని బాలాజీ లాబ్స్లో డ్రగ్ తయారు చేస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు.
అదుపులోకి తీసుకున్న నిందితులను పోలీసులు విచారణ జరుపుతున్నారు. డ్రగ్స్ను ఎక్కడెక్కడికి సరఫరా చేస్తారా? ఎవరెవరితో సబంధాలు ఉన్నాయన్నదానిపై ఆరా తీస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more