ప్రతి ఒక్కరి ద్రుష్టి ఇప్పుడు హైదరాబాద్ మీదనే ఉంది. హైదరాబాద్ పై ఉత్కంఠత ప్రతి ఒక్కరిలో రేగుతుంది. రాష్ట్ర విభజనపై కేంద్ర నిర్ణయం దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో హైదరాబాద్పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న అంశంపై ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో వాడివేడిగా చర్చసాగుతోంది. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తారా? లేక రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేస్తారా? అన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి కేంద్రం తీసుకుబోయే నిర్ణయంపైనే కేంద్రీకృతమై ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నగరానికి చెందిన మంత్రులు దానం నాగేందర్, ముఖేశ్గౌడ్లు ఢిల్లీ వెలుతుండడం రాజకీయవర్గాల్లో మరింత కాక పుట్టిస్తున్నది. హైదరాబాద్ విషయంలో పార్టీ అధిష్టానం మదిలో ఏముందన్న అంశంపై ఆరా తీసేందుకుగానూ వారు హస్తిన బాట పట్టినట్లు రాజకీయవర్గాల్లోనూ జోరుగా ప్రచారం సాగుతున్నది. రాష్ట్రాన్ని విభజించడం ఖాయమైన నేపథ్యంలో ఇరు ప్రాంతాల నాయకులను సంతృప్తి పరిచేందుకు హైదరాబాద్పై కీలక నిర్ణయం తీసుకోవాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నది.
ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న అంశంపై వివిధ కోణాల్లో ఆలోచిస్తున్నది. ఇదే అంశం కూడా హైదరాబాద్లోనూ ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. యుపిఏ సమన్వయ కమిటీ భేటి, అనంతరం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర విభజనపై కేంద్రం ఒక నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశమున్న నేపథ్యంలో ఇద్దరు మంత్రులు కలిసి ఢిల్లీ వెళుతుండడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అక్కడ పార్టీ పెద్దలను కలుసుకుని హైదరాబాద్పై చర్చించనున్నట్లు తెలిసింది. మొదట్లో రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన మంత్రులిద్దరూ అనంతరం ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ను అర్ధం చేసుకుని తమ వాదంపై వెనక్కితగ్గారు. పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే హైదరాబాద్ను ఏం చేస్తున్నారన్న అంశంపై ముందుగా ఒక క్లారిటి ఇవ్వాలని పట్టుపడుతున్న విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more