తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో కాలయాపనకు కారణమవుతున్నారనే ఫిర్యాదు మేరకు యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్లపై కేసు నమోదు చేయాలని మల్కాజిగిరి పదో మెట్రోపాలిటిన్ కోర్టు కుషాయిగూడ పోలీసులకు సూచించిందని న్యాయవాది మేకల శ్రీనివాస్యాదవ్ తెలిపారు. సోనియా గాంధీ, ఉండవల్లిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సతీష్ అగర్వాల్ గత జనవరి 29న మల్కాజిగిరి పదో మెట్రోపాలిటిన్ కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. 2004 ఎన్నికల సందర్భంగా కరీంనగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సోనియాగాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉందని, తెలంగాణ ఇవ్వడంలో తమకెలాంటి అభ్యంతరంలేదని చెప్పారని పిటిషనర్ ప్రస్తావించారు. నాడు ఆమె ప్రసంగాన్ని తెలుగులోకి అనువాదం చేసి ప్రజలకు వినిపించిన రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ఇప్పుడు ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ విషయంలో ప్రజలను నమ్మించి, ఇప్పుడు కాలయాపనకు కారణమవుతున్న వారిద్దరిపై చీటింగ్ కేసు నమోదుకు ఆదేశించాలని కోర్టును కోరారు. ఆయన ఫిర్యాదును పరిశీలించిన కోర్టు... ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఈ నెల 29 లోగా వివరణ ఇవ్వాలని కుషాయిగూడ పోలీసులకు సూచించింది. కోర్టు ఆదేశాలు అందాయని, ఉన్నతాధికారుల సూచనలననుసరించి కేసు నమోదు చేస్తామని కుషాయిగూడ ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more