Police commissioner anurag sharma

police commissioner anurag sharma, anurag sharma, central government serious, cm kiran kumar reddy, dgp dinesh reddy, hyderabad bomb blast,

police commissioner anurag sharma

anurag-sharma.gif

Posted: 03/01/2013 05:42 PM IST
Police commissioner anurag sharma

police commissioner anurag sharma

ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందంటూ కేంద్ర హోం శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా...ఉపేక్షిస్తూ కూర్చున్నారనే ఆరోపణలపై నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మపై కేంద్ర హోం శాఖ గుర్రుమంటోంది. తక్షణమే ఆయన్ను ఆ స్థానం నుంచి తప్పించి... మరో సమర్థుడైన అధికారికి చోటు కల్పించాలని కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే అనురాగ్‌శర్మ బదిలీ ప్రతిపాదనను డీజీపీ దినేష్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశంపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తర్జనభర్జనలు పడుతున్నారు. అయితే అనురాగ్‌శర్మ బదిలీ తప్పదని ఢిల్లీకి చెందిన అధికార వర్గాలు చెబుతున్నాయి.  బాంబు పేలుళ్ల ఘటనను నిరోధించటంలో అనురాగ్‌శర్మ వైఫల్యం ఏ మేరకు ఉందనే అంశంపై కిరణ్‌కుమార్‌రెడ్డి స్వయంగా నివేదిక తెప్పించుకుంటున్నారు. ఫిబ్రవరి 21న దిల్‌సుక్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్లలో 16 మంది మృత్యువాత పడటంతో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశిస్తున్న తరుణంలో చోటుచేసుకున్న ఉగ్రదాడులు ప్రభుత్వానికి ఓ సవాల్‌గా పరిణమించాయి. 


అందుకే ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ కూడా స్వయంగా వచ్చి సంఘటనా స్థలాన్ని సందర్శించటంతో పాటు....భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. నగర పోలీస్ కమిషనర్ నియామకానికి ముందు అనురాగ్‌శర్మ ఎప్పుడూ పోలీస్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించలేదని...అలాంటి వ్యక్తికి ఏకంగా అత్యంత కీలకమైన కమిషనర్ బాధ్యతలు అప్పగించటంతో సరిగా వ్యవహరించ లేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి.  గతంలో నగరంలో రెండుసార్లు బాంబు పేలుళ్లు జరిగాయని... ఆ సమయంలో నగర కమిషనర్‌ను బదిలీ చేయనందున....ఇప్పుడు కూడా అనురాగ్‌శర్మను బదిలీ చేయాల్సిన అవసరం లేదని డీజీపీ దినేష్‌రెడ్డి వాదిస్తున్నారు. కేవలం బాంబు పేలుళ్ల ఘటనను దృష్టిలో పెట్టుకుని నగర కమిషనర్‌ను బ(ది)లీ చేయటం సరికాదని చెబుతున్నారు. అయితే బాంబు పేలుళ్ల ఘటన అనంతరం చేపట్టిన ప్రాథమిక విచారణలోనూ అనురాగ్‌శర్మ సరిగా వ్యవహరించలేకపోయారని భావిస్తున్న కేంద్రం...ఆయన్ను అక్కడ నుంచి తప్పించాల్సిందేనని పట్టుబడుతోంది. బాంబు పేలుళ్లు చోటుచేసుకున్న ప్రాంతాల్లో ఒకటి హైదరాబాద్ కమిషనర్ పరిధిలోకి, మరొకటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలోకి వస్తుంది. అలాంటప్పుడు హైదరాబాద్ కమిషనర్ ఒక్కరినే ఎలా బలిపశువుని చేస్తారని పోలీస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hyderabad twin blasts police begins operation bicycle hunt
Villa marie college farewell party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more