T agitation man mohansing hyderabad

t agitation man mohansing hyderabad , harish rao eetela rajender

t agitation man mohansing hyderabad

3.png

Posted: 10/17/2012 01:27 PM IST
T agitation man mohansing hyderabad

PM-bio-జీవ వైవిధ్య సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌కు నిరసన వ్యక్తం చేసేందుకు పొలిటికల్‌ జెఎసి ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన ఐక్య నిరసన దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్రశాంతం గానే సాగిన దీక్ష ముగిసే సమయంలో పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ప్రధానికి నిరసన తెలుపుతామంటూ ఒక్కసారిగా తెలంగాణవాదులు ముందుకు దూసుకొచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను సైతం ధ్వంసం చేశారు. తెరాస ఎమ్మెల్యే టి.హరీష్‌రావు వడివడిగా నడుస్తూ తెలంగాణవాదులను సైతం బారికేడ్లు దాటాలని సైగలు చేశారు. దీంతో పోలీసులు హరీష్‌తో పాటు పొలిటికల్‌ జెఎసి చైర్మన్‌ కోదండరాం, తెలంగాణ నగారా సమితి నేత నాగం జనార్ధనరెడ్డి, జోగు రామన్న, ఉద్యోగ సంఘాల నేతలు స్వామిగౌడ్‌ను అడ్డు కున్నారు. దీంతో తెలంగాణవాదులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చివరికి పోలీసులు హరీష్‌రావు, కోదండరాం, దత్తాత్రేయ, నాగం జనార్ధనరెడ్డి, స్వామిగౌడ్‌ తదిత రులను అరెస్టు చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.
        ఇందిరా పార్కు వద్ద నిరసన దీక్ష సందర్భంగా పొలిటికల్‌ జెఎసి నేతలు నల్ల దుస్తులు, నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రధానికి తమ నిరసన తెలియజేశారు. బేగంపేట విమానాశ్రయంలో హెలికా ప్టర్‌లో దిగి జీవ వైవిధ్య సదస్సు, పైలా న్‌ ఆవిష్కరణ కార్యక్రమాలకు సైతం హెలికాప్టర్‌లోనే వెళ్లిన ప్రధానికి ఆకాశ మార్గంలో నిరసన తెలిపే విధంగా నల్ల బెలూన్లను వదిలారు.
         జీవ వైవిధ్య సదస్సులో భాగంగా పైలాన్‌ ఆవిష్కరణకు వచ్చిన ప్రధాన మంత్రిని అడ్డుకునే అవకాశం ఉందన్న అనుమానంతో ముందు జాగ్రత్తగా పోలీసులు ప్రత్యేకించి తెలంగాణ మీడియా సంస్థలకు చెందిన కొంత మంది జర్నలిస్టులను అడ్డుకున్నారు. తాము గత 16 రోజులుగా సదస్సు విశేషాలను కవర్‌ చేస్తున్నామని చెప్పినప్పటికీ పోలీసులు వినలేదు. దీంతో కార్యక్రమం జరుగుతున్న ప్రాంగణం బయట తెలం గాణ జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు మద్దతుగా సచివా లయంలో టి-జర్నలిస్టుల ఫోరం ఆధ్వ ర్యంలో క్రాంతికుమార్‌, సంగప్ప, రమణ, రాజు, కప్పర ప్రసాద్‌ తదితరుల ఆధ్వర్యంలో సచివాలయంలోని సి- బ్లాకు వద్ద ఆందోళన, ధర్నా నిర్వహిం చారు. పోలీసులు వీరిని అరెస్టు చేసి నాంపల్లి స్టేషన్‌కు తరలించారు. అయితే పోలీసుల అరెస్టుకు నిరసనగా జర్నలిస్టులు అక్కడే బైఠాయించారు.
        కేంద్ర ప్రభుత్వ విశ్వాస ఘాతుకానికి నిరసనగా, ఇందిరా పార్కు వద్ద నిర్వ హించిన ఐక్య నిరసన దీక్షలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.కేశవరావుకు అవమానం ఎదురైంది. సభా వేదికపైకి ఆయనను ఆహ్వానించగానే తెలంగాణ వాదులు ఒక్కసారిగా ఆయనకు వ్యతిరేకం గా నినాదాలు చేశారు. తెలంగాణకు కాం గ్రెస్‌ పార్టీ తీరని ద్రోహం చేస్తున్నదనీ, ఉద్యమంలో కొనసాగే వారు ఆ పార్టీలో ఉండొద్దని నినాదాలు చేశారు. దీంతో నొచ్చుకున్న కెకె వెనుదిరిగి వెళ్లడానికి ప్రయత్నించారు. ఈ దశలో వేదికపై ఉన్న తెలంగాణ నగారా సమితి అధ్య క్షుడు నాగం జనార్ధనరెడ్డి, జెఎసి చైర్మన్‌ కోదండరాంతో పాటు తెరాస ఎమ్మె ల్యేలు హరీష్‌రావు, ఈటెల కార్యకర్తలకు నచ్చజెప్పారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Train tickets gets three days before
Gas cylender price quota  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more