Producer Annamreddy dies of cardiac arrest సినిమా విడుదలకు ముందే తుది మజిలీకి ‘అనుకోని అతిధి’

Producer annamreddy krishna kumar dies of cardiac arrest in vizag

tollywood producer Annamreddy Krishna Kumar, Anukoni athidhi Annamreddy Krishna Kumar, Annamreddy Krishna Kumar vishakapatnam, Annamreddy Krishna Kumar cardiac arrest, Annamreddy Krishna Kumar, Annamreddy krishna kumar dies, Anukoni Athidhi, Fahadh Faasil, Sai Pallavi, Tollywood

Telugu film producer Annamreddy Krishna Kumar died on May 26 after suffering a massive cardiac arrest. He breathed his last in Visakhapatnam. Krishna Kumar's death has come as a huge shock to everyone in Tollywood.

టాలీవుడ్ లో విషాధం.. సినీనిర్మాత అన్నంరెడ్డి హఠాన్మరణం

Posted: 05/26/2021 10:22 AM IST
Producer annamreddy krishna kumar dies of cardiac arrest in vizag

టాలీవుడ్ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కరోనా మహమ్మారి ఓ వైపు తన పంజాను విసిరి సినీ ప్రముఖుల ప్రాణాలను కబళిస్తున్న క్రమంలోనే పలువురు సినీకళామతల్లి ముద్దుబిడ్డలను హృద్రోగాలు, ఇతర వ్యాధులు బలితీసుకుంటున్నాయి. ఇప్పటికే పరిశ్రమలో పేరు పొందిన గాయకుడు జి.ఆనంద్‌, సినీమాటోగ్రాఫర్ వి.జయరాం, స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌ మోహన్ జీతో పాటు రచయిత నంద్యాల‌ రవి, నటుడు, పాత్రికేయుడు టీఎన్‌ఆర్‌, పీఆర్వో బీఏ రాజుల వరుస మరణాలతో చిత్రపరిశ్రమలో విషాధంలో మునిగిపోయింది. తాజాగా నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్‌ తుదిశ్వాస విడిచారు. ఆయన హఠాన్మరణంలో సినీప్రముఖులు షాక్ కు గురయ్యారు.

విశాఖలోని తన నివాసంలో వున్న ఆయనకు ఇవాళ తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కన్నుమూశారు. సాయిపల్లవి, ఫహాద్‌ ఫాజిల్‌ జంటగా నటించిన ‘అనుకోని అతిథి’ చిత్రానికి ఆయన నిర్మాతగా వ్యవహరించారు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ‘ఆహా’ ఓటీటీ వేదికగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత కృష్ణకుమార్‌ మృతిచెందడంతో చిత్రబృందమే కాకుండా మొత్తం టాలీవుడ్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు సైతం ఆయన మృతిపట్ల సంతాపం ప్రకటించారు. కృష్ణకుమార్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

తరుణ్ కథానాయకుడిగా నటించిన ‘సఖియా నాతో రా’తో పాటు ‘ఈ పిల్లకి పెళ్ళవుతుందా’, ‘కలికాలం ఆడది’, ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’, ‘ఈ దేశంలో ఒకరోజు’ చిత్రాలకు కృష్ణకుమార్‌ నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాకుండా దర్శకుడు మారుతితో కలిసి ‘బెస్ట్ యాక్టర్స్’ చిత్రానికి కూడా ఈయన నిర్మాతగా ఉన్నారు. మరోవైపు కృష్ణకుమార్ భార్య జ్యోతి కొన్నేళ్ళ క్రితం కాలం చేశారు.‌ ‘వంశ వృక్షం’, ‘తూర్పు వెళ్ళే రైలు’, ‘మరో మలుపు’, ‘మల్లె పందిరి’ తదితర చిత్రాలలో ఆమె కథానాయికగా నటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles