కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న క్రమంలో దేశంలో ఆక్సిజన్ అందక అనేక ప్రాణాలు అనంతవాయువుల్లో కలసిపోయాయి. దీంతో ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతున్న క్రమంలో సినీ నటులు సోనూసూద్ నుండి ఎందరో ప్రముఖులు దేశంలో ఆక్సిజన్ అందించేందుకు తమవంతు కృషి చేస్తున్నారు. సమాజం పట్ల, ప్రజల పట్ల అభిమానంతో సమాజసేవలో ముందుండే మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది కరోనా నేపథ్యంలో కోవిడ్ క్రైసెస్ చారిటీ ఏర్పాటు చేసి సినీ కార్మికులను అదుకున్నారు. అయితే ఈ సారి ప్రాణవాయువు కొరత ప్రాణాలను కబళించివేస్తుందన్న విషయం తెలుసుకుని తెలుగు రాష్ట్రాలలో ఆక్సిజన్ కొరతను తగ్గించేందుకు తనవంతు ప్రయత్నం మొదలుపెట్టారు.
దశాబ్దాలుగా తన పేరునున్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేత్ర, రక్తదానంలో విస్తృత సేవలు అందిస్తున్న చిరంజీవి తాజాగా తన తనయుడు రామ్ చరణ్ తో కలసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు చేశారు. జిల్లా అభిమాన సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు కాగా, క్రితం రోజున కొన్ని జిల్లాలకు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు పంపిణీ జరిగింది. ఇవాళ మరికొన్ని జిల్లాలకు ఆక్సిజన్ కాన్సెంట్లేటర్లు పంఫిణీ చేసిన ఆయన ఇవాళ అధికారికంగా ఆక్సిజన్ సెంటర్లను ప్రారంభించారు.
ఏపీ, తెలంగాణలోని ప్రతి జిల్లాల్లో ఆస్పత్రి నుంచి ఆక్సిజన్ కావాలని కోరగానే సిలిండర్లను పంపిస్తారు. అవసరాన్ని బట్టి ఈ పంపిణీ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్కరూ మరణించకూడదన్న ఉద్దేశంతో చిరంజీవి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగువారందరికీ ఈ ఆక్సిజన్ బ్యాంక్ అందుబాటులో ఉండనుండగా.. దీని కోసం ప్రత్యేకంగా ట్విట్టర్ అకౌంటును కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో నిరంతరాయంగా ఆక్సిజన్ పంపిణీ కొనసాగుతుంది.
ఇక్కడ కొరతను తీర్చేందుకు చైనా నుంచి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఆర్డర్ చేశాం. ప్రస్తుతం చాలా చోట్ల వీటి కొరత నెలకొంది. అత్యవసరంగా ఎక్కడ అవసరం ఉంది అనేది తెలుసుకొని ఆక్సిజన్ సిలిండర్లు అందిస్తున్నాం. అన్ని జిల్లాలకు అవసరం ఉన్న అన్నిచోట్లకు పంపిణీ చేస్తాం. అలాగే ప్రతిచోటా ఆక్సిజన్ సిలిండర్లు ఎక్కడెక్కడ ఏ టైంలో చేరుకుంటున్నాయి అనేది ట్రాకింగ్ పరికరాన్ని కూడా టెక్నీషియన్లు ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ఆఫీసు నుంచి పర్యవేక్షణ ఉంటుంది. అన్నిచోట్లా ఇది సద్వినియోగం కావాలనే మా ప్రయత్నం. రామ్ చరణ్ దగ్గరుండి ఈ ఏర్పాట్లన్నీ చూస్తున్నారని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more