వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ‘ఎన్టీఆర్’ ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమా ప్రకటన చేసిన రోజు నుంచే ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన సంగతి తెలిసిందే. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా టీజర్లో ఎన్నో విషయాలు ప్రస్తావించారు వర్మ. ‘నమ్మితేనే కదా మోసం చేసేది’ అంటూ అడవిరాముడు సినిమాలోని డైలాగ్ను స్క్రీన్పై ప్లే చేశారు. 1989 ఎన్నికల్లో ఎన్టీఆర్ దారుణంగా ఓడిపోయిన రోజులవి అంటూ టీజర్ మొదలవుతుంది.
అప్పుడే ఫోన్ కాల్ రావడం, ఆ తర్వాత ఎన్టీఆర్ కుటుంబసభ్యులంతా ఒక్కొక్కరుగా ఆయన్ని విడిచి వెళ్లిపోవడం చూపించారు. అనంతరం లక్ష్మీపార్వతి ఎంట్రీ ఇవ్వడం, కాళ్లు మొక్కి స్వామి మీకు ఫోన్ చేసిన లక్ష్మీపార్వతిని నేనే అంటూ పరిచయం చేసుకోవడం టీజర్లో చూపించారు. ఆ తర్వాత ఎన్టీఆర్కు లక్ష్మీపార్వతి దగ్గరకావడం, దీంతో ఆమెను ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ధూషించి కొట్టడం, తమ బంధంపై పత్రికల్లో వచ్చిన కథనాలపై లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ వద్ద బాధపడటం, పార్టీ, కుటుంబం నుంచి ఎన్టీఆర్ను దూరం చేసేందుకు చంద్రబాబు చేసిన కుట్ర, ప్రజల మధ్యలో ప్రసంగిస్తున్న ఎన్టీఆర్పై చెప్పులు విసరడం.. ఇలా తన సినిమా ఎలా ఉండబోతోందో ట్రైలర్లోనే చూపించేశారు వర్మ.
‘నా మొత్తం జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు వాడిని నేను నమ్మడం’ అంటూ ఎన్టీఆర్ కంటతడి పెడుతూ చెబుతున్న డైలాగ్తో ట్రైలర్ ముగించారు. ఇప్పటికే విడుదల చేసిన పాటలతో వర్మపై టీడీపీ శ్రేణులు మండిపడిన సంగతి తెలిసిందే. ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు విడుదల చేసిన ట్రైలర్లో ఏకంగా చంద్రబాబునే విలన్గా చూపిండటంతో మరింత వివాదం రగిలే సూచనలు కనిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Mar 04 | పర్సంటేజ్ తక్కువొచ్చిందని ఎవరైనా చదువు మానేస్తారా? మన జాతి రత్నం శ్రీకాంత్ అలియాస్ నవీన్ పొలిశెట్టి మాత్రం బీటెక్లో 40 శాతమే వచ్చిందిని ఎమ్టెక్ చేయకుండా ఉండిపోయాడట. అది నిజంగా కాదులెండి జాతిరత్నాలు సినిమాలో.... Read more
Mar 04 | రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘అరణ్య’.. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గోంకర్, సామ్రాట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’, ‘రైలు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను... Read more
Mar 04 | ఎంత దూరమైనా డ్రైవింగ్ చేసేందుకు రెడీ కానీ, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాలంటే మాత్రం మావల్ల కాదంటుంటారు చాలామంది వాహనదారులు. ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ పడుతుందా? ఎప్పుడు సర్రుమంటూ స్పీడుతో ముందుకు దూసుకెళ్దామా? అని... Read more
Mar 04 | టాలీవుడ్ హీరోలు ఒకరి సినిమాల్లోని పాటలను మరొకరు రిలీజ్ చేస్తూ సుహృద్భావ వాతావరణం కొనసాగిస్తున్నారు. తాజాగా, నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన రంగ్ దే చిత్రంలో మూడో పాటను సూపర్ స్టార్ మహేశ్... Read more
Mar 03 | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల తరువాత సినీరంగంలోకీ రీ-ఎంట్రీ ఇస్తూ.. పవర్ ఫుల్ న్యాయవాది పాత్రలో మెరువనున్న చిత్రం ‘‘వకీల్ సాబ్’’. 'దిల్' రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి... Read more