టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ చిలిపి చేష్టలు రోజురోజుకి మరీ ఎక్కువైపోతున్నాయని తెలుగు ప్రజలు భావిస్తున్నారు. మొన్న ‘విశాఖ ఉత్సవ్ 2016’ ముగింపు కార్యక్రమంలో ‘పొగత్రాగనివాడు మరుజన్మలో దున్నపోతై పుట్టును... అంటే ప్యూర్ బఫెల్లో’ అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ‘సావిత్రి’ ఆడియో విడుదల కార్యక్రమంలో ‘అమ్మాయిల వెంటపడితే ఊరుకుంటారా ఫ్యాన్స్.. ఊరుకోరు కదా! వెళ్లి ముద్దు అయినా పెట్టాలి లేదా కడుపైనా చేసేయ్యాలి... కమిట్ అయిపోవాలి’ అని మాట్లాడి తెలుగు ఆడపడచులు ఆగ్రహానికి గురయ్యారు. నిన్న తమిళనాడు ఏకంగా షర్టు విప్పేసి, పబ్లిక్ గా సిగరేట్ తాగుతూ క్రికెట్ ఆటను తిలకించి సౌత్ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ అయ్యారు.
ఇలా రోజు రోజుకి బాలయ్యపై ఫిర్యాదులు ఎక్కువవుతున్నాయి. తాజాగా మరోసారి బాలయ్య హాట్ టాపిక్ గా మారాడు. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న తాజా తెలుగు, తమిళ చిత్రం ‘నాయకి’. గోవి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతం అందించారు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి బాలయ్య ముఖ్య అతిథిగా విచ్చేసారు.
ఈ వేడుక ప్రారంభంలో త్రిషను కలవగానే... త్రిష బుగ్గలపై ముద్దు పెట్టి వెల్ కమ్ చెప్పేసాడు బాలయ్య. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలు చూసినవాళ్లంతా కూడా ‘బాలయ్యకు వయసు పెరిగినకొద్ది తనలోని బాలకృష్ణుడు మరింతగా రెచ్చిపోతున్నాడు’, ‘హీరోయిన్ కనిపిస్తే.. మరీ అలా ముద్దులు పెట్టేయడమేనా...’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో బాలయ్య చేసిన ఈ పనిని సమర్ధిస్తూ.. గతంలో వీరిద్దరూ కలిసి ‘లయన్’ సినిమాలో నటించారు కాబట్టి.. ఆ చనువుతో అలా ముద్దులు పెట్టి వుంటాడని సమర్థించుకుంటున్నారు.
ఏదేమైనా బాలయ్య-త్రిషల కాంబినేషన్లో వచ్చిన ‘లయన్’ సినిమా అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ... ‘నాయకి’ ఆడియో విడుదల కార్యక్రమంలో వీరి ముద్దుల సరసం ఫోటోలు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారి భారీ విజయం సాధించాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి ‘నాయకి’ ఆడియో వేడుకలో ఈ కిస్ మూమెంట్ హైలెట్ గా నిలిచిందని సినీజనాలు కోడైకూస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more