ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం ఘనవిజయం సాధించడంతోపాటు ఆదరణలు పొందింది. గ్రామాన్ని దత్తత తీసుకునే నేపథ్యంతో రూపొందిన ఆ చిత్రం.. సమాజానికి ఓ మెస్సేజ్ అందించే మంచి సినిమాగా పేరుగాంచింది. దీంతో ఆ చిత్రాన్ని వీక్షించిన ఎందరో రాజకీయ, సినీ ప్రముఖులు ఆ చిత్రాన్ని, మహేష్ బాబుని ప్రశంసలతో ముంచెత్తారు. నలుగురికి ఆదర్శంగా వుండేలా సమాజానికి ఉపయోగపడే మంచి సినిమా చేసినందుకు మహేష్ కు అభినందనలు తెలిపారు. అలా కృతజ్ఞతలు తెలిపిన వారి జాబితాలో రామ్ చరణ్ ఒకడు. అవును.. ఆమధ్య తనను అభినందించిన వారిలో రాజకీయ ప్రముఖులు ఎక్కువగా వున్నారని పేర్కొన్న మహేష్.. ఇండస్ట్రీ నుంచి కేవలం చరణ్ ఒక్కడే అభినందించాడని తెలిపాడు. దీంతో అటు మహేష్ అభిమానులతోపాటు మెగాభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు నందమూరి అభిమానుల వంతు వచ్చింది. ఎందుకంటే.. తాజాగా ఎన్టీఆర్ ఈ సినిమాని చూసిన అనంతరం ఇంప్రెస్ అయి, మహేష్ కి ఫోన్ చేసి మరి ప్రశంసించినట్లు సమాచారం.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే! ఈ మూవీ షూటింగ్ లో భాగంగా యూనిట్ తోపాటు జూనియర్ ఎన్టీఆర్ మూడు నెలలు లండన్ లోనే వుండాల్సి వచ్చింది. ఎడతెరిపి లేకుండా 80 రోజులపాటు షూటింగ్ లో పాల్గొన్న ఎన్టీఆర్.. తిరిగి ఇటీవల ఇండియాకి (యూనిట్ సహా) చేరుకున్నాడు. ఇక్కడికి వచ్చిన వెంటనే దర్శకుడు సుకుమార్ తో కలిసి ‘శ్రీమంతుడు’ చిత్రం చూసినట్లు తెలిసింది. ఆ సినిమాను చూసి ఇంప్రెస్ అయిన ఎన్టీఆర్.. వెంటనే మహేష్ కు పర్సనల్ గా ఫోన్ చేసి అభినందించినట్లు ముంచెత్తారని తెలుస్తోంది. మంచి సినిమా చేసి, ఘనవిజయం సాధించినందుకు మహేష్ ని పొగడ్తలతో ముంచెత్తినట్లు సమాచారం. దీంతో మహేష్ హ్యాపీగా ఫీలయ్యాడని అంటున్నారు. ఏదేమైనా.. ‘శ్రీమంతుడు’ చిత్రం కారణంగా మహేష్ ఇమేజ్ మరింత పెరిగిందని తెలుస్తోంది. ఇదిలావుండగా.. 158 సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. టాలీవుడ్ లో ‘బాహుబలి’ తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more