సాధారణంగా ఓ మూవీ స్టార్ట్ చేస్తున్నారంటే.. ఆ మూవీకి కావాల్సిన క్యాస్టింగ్ కార్యక్రమాలను ముందుగా కొనసాగిస్తున్నారు. అందులో ముఖ్యంగా హీరోయిన్ల ఎంపిక విషయంలో అయితే మరీ జాగ్రత్తగా వ్యవహరించి సెలెక్ట్ చేసుకుంటారు. ఇలా ఏ మూవీకి అయినా ముందుగా అందరినీ ఎంపిక చేసుకున్న తర్వాత షూటింగ్ ప్రారంభిస్తారు. కానీ.. ‘కేరింత’ మూవీ విషయంలో మాత్రం అలా కాదు.. తమకు నచ్చిన హీరోయిన్లను సెలెక్ట్ చేసి, వారితో కొన్ని షూట్ చేసిన తర్వాత కూడా అందుకు సరిపోవడం లేదంటూ వరుసగా మార్చుకుంటూ పోతున్నారని సమాచారం!
టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్’రాజు, సాయి కిరణ్ అడివి దర్శకత్వంలో ‘కేరింత’ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం వున్న టీనేజీ కుర్రకారులు ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారన్న కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. అంతా కొత్త తారలతోనే చిత్రీకరణ మొదలుపెట్టేసి చాలాకాలమే అవుతోంది. కానీ.. కథానాయిక విషయంలో మాత్రం సరిగ్గా క్లారిటీ లేకపోవడం వల్ల ఇప్పటికే ముగ్గురు హీరోయిన్లను మార్చేశారట! మొదట్లో అవంతిక అనే కథానాయికను ఎంపిక చేసుకున్నారు. స్ర్కీన్ టెస్ట్ కూడా చేశారు. కానీ.. ఆమె ఆ పాత్రకు సరిపోదని బావించి తీసేశారు. తర్వాత ‘అందాల రాక్షసి’ ఫేం లావణ్య త్రిపాఠిని ఎంపిక చేసుకుని, కొంతకాలం షూటింగ్ కూడా చేశారు. అయితే.. ఆమె కూడా ఆ పాత్రకు సరిపోవడం లేదని భావించి ఆమెను తీసేశారు.
ఇక చివరగా ‘దృశ్యం’ ఫేం కృతికను కథానాయికగా తీసుకున్నారు. కొన్ని సీన్లు కూడా షూట్ చేసినట్లు యూనిట్ సమాచారం. కానీ ఈ భామ కూడా ఆ సినిమా నుంచి తప్పుకుందని ప్రచారాలు కొనసాగుతున్నాయి. మరోవైపు.. ఆ మూవీ కోసం ఇంకా కథానాయిక వేట కొనసాగుతూనే వుందని అంటున్నారు. షూటింగ్ ప్రారంభించి చాలాకాలమే అయినా.. తమ కథలోని పాత్రకు తగ్గట్టు సరైన కథానాయిక దొరక్కపోవడంతో దర్శకనిర్మాతలు తర్జనభర్జన అవుతున్నారట! మరి.. వీరికి ఆ నాయిక ఎప్పుడు దొరుకుతుందో వేచి చూడాల్సిందే!
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more