Karishma kapoor not interested in second marriage

Karishma kapoor latest news, kareena kapoor latest news, karishma kapoor dating, karishma kapoor children, karishma kapoor husband, karishma kapoor second marriage, karishma kapoor kareena kapoor, kareena kapoor press meet, karishma kapoor press meet

Karishma kapoor not interested in second marriage : the bollywood bebo kareena kapoor clarifies that karishma is no longer interested in second marriage and she is not dating with sandeep toshnilwal who is a businessman.

మగాడి జోలికి వెళ్లనంటున్న కరిష్మా కపూర్

Posted: 08/06/2014 06:24 PM IST
Karishma kapoor not interested in second marriage

బాలీవుడ్ లో కొంతకాలంపాటు తన చరిష్మాతో ప్రేక్షకులను మత్తెక్కించిన కరిష్మా కపూర్... పెళ్లి చేసుకున్న అనంతరం తెరపై కనిపించడం మానేసింది. అయితే ఏ విధంగా అయితే చిత్రజీవితంలో తాను సక్సెస్ అయిందో... వ్యక్తిగత జీవితంలో అంతే దెబ్బతినింది. వివాహానంతరం కొన్నాళ్లపాటు భర్తతో సాఫీగానే జీవితాన్ని కొనసాగించిన ఈ అమ్మడు.. తరువాత పరస్పరం మనస్పర్థలు ఏర్పడటంతో ఇద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి ఈ భామ తన ఇద్దరు పిల్లలతో కలిసి విడిగానే జీవితాన్ని గడుపుతోంది.

ఇప్పుడు తాజాగా ఈ అమ్మడు ఒక ప్రముఖ వ్యాపారవేత్త అయిన సందీప్ తోష్నివాల్ తో కలిసి చట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని.. త్వరలోనే అతనితో పెళ్లి చేసుకోబోతోందని వార్తలు జోరందుకుంటున్నాయి. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఫెయిల్ అయిన ఈ అమ్మడు.. ఇక త్వరలోనే సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టబోతోందని బాలీవుడ్ లో వున్న సినీ ప్రముఖులు సైతం చర్చించుకుంటున్నారు. కానీ కరిష్మా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మగాడి జోలికి వెళ్లను బాబోయ్..! అంటూ వాదనలు వినిపిస్తోంది. ఇదివరకే తన భర్త తనకు చాలా ఇబ్బందులకు గురి చేశాడని, స్వేచ్ఛగా బతకనివ్వకుండా చిత్రహింసలకు గురిచేసేవాడని పేర్కొన్న ఈ అమ్మడు... మరోసారి అటువంటి జీవితాన్ని కోరుకోబోనని అంటోంది. ఏ మగాడి సహాయం లేకుండా తన పిల్లలతో జీవితాంతం సుఖంగా గడుపుతానని స్టేట్ మెంట్లు ఇస్తోంది.

ఇదిలా వుండగా.. కరిష్మాపై వస్తున్న పెళ్లి వార్తలను ఆమె సోదరి కరీనా కపూర్ కూడా కొట్టిపారేసింది. తనకు సందీప్ తోష్నివాల్ కేవలం వ్యాపారం నిమిత్తం మాత్రమే స్నేహం వుంది తప్ప.. పెళ్లి చేసుకునే ఆలోచనలే లేవంటూ ఆమె స్పష్టం చేసింది. పెళ్లి చేసుకుని కలిసి వుండి నిత్యం ఘర్షన పడేదానికంటే.. విడిగా వుంటూ ప్రశాంతంగా గడపడమే మంచిదని హేతువులు పలుకుతోంది ఈ పెళ్లైన ముదురు భామ. కరిష్మా ఇక పెళ్లి చేసుకోబోదని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే కరిష్మాకు ఇంతవరకు విడాకులు రాలేదని.. దాంతో ఆమె తీవ్ర బాధలో వుందని కరీనా కపూర్ పేర్కొన్నట్లు ముంబయిలోని స్థానిక పత్రిక ప్రచురించింది.

మరోవైపు కరీనా కపూర్ చేసిన వ్యాఖ్యల మీద కొంతమంది విశ్లేషకులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ‘‘మగాడితో పెళ్లి చేసుకుని నిత్యం ఘర్షణ పడేదానికంటే.. ఒంటరిగా వుంటూ ప్రశాంతంగా వుండటం మంచిదని’’ పేర్కొన్న కరీనా.. పెళ్లెందుకు చేసుకుంది..? అంటూ విమర్శలు చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం అక్కకు మద్దతుగా అలా మాట్లాడిందే తప్ప.. మరే ఉద్దేశం వుండదంటూ పేర్కొంటున్నారు. మరి దీనిమీద కరిష్మా ఎలా స్పందించనుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles