Puri jagannadh revels

puri jagannadh revels

puri jagannadh revels

7.gif

Posted: 05/18/2012 04:24 PM IST
Puri jagannadh revels

       పవన్ కళ్యాన్ - పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం తెరకెక్కనుందనే విషయం తెలిసిందే. పూరీ దర్శకత్వం వహిస్తోన్న 'దేవుడు చేసిన మనుషులు' సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తుండగా, పవన్ కళ్యాన్ 'గబ్బర్ సింగ్' ఆల్రెడీ విడుదలై సక్సెస్ ని సాధించింది.5 దాంతో వీరి తదుపరి చిత్రంగా రానున్న 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాకి రంగాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ సినిమా షూటింగ్ జూన్ 8 న లాంఛనంగా ప్రారంభం కానుంది. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ ని ఆరంభించి, అక్టోబర్ 18 న ఈ సినిమాని విడుదలచేసే ఆలోచనలో పూరీ కసరత్తు చేస్తున్నాడు.
       కాగా, ఈ  చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి స్క్రిప్టును దర్శకుడు పూరీ జగన్నాథ్ చెప్పగా పవన్ కల్యాణ్ వినడం జరిగింది. కథ మొత్తం వినగానే పవన్ ఎంతగానో ఎగ్జైట్ అయ్యాడట. ఈ చిత్రంలో నటిస్తున్నందుకు గర్వపడుతున్నానని పవన్ కామెంట్ చేసినట్టు వినికిడి. అయితే..4  ఆ కామెంట్ తో ఉబ్బితబ్బిబ్బయిన పూరీ జగన్నాథ్ నిన్న రాత్రి అస్సలు పడుకోలేదట. 'గబ్బర్ సింగ్' విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ 'కెమెరామేన్ గంగతో రాంబాబు' చిత్రాన్ని కమర్షియల్ సినిమాగా బిగ్గెస్ట్ హిట్ అయ్యేలా చేసే గ్యారంటీ తనదని పూరీ చెబుతున్నాడు.
      తమన్నా కథానాయికగా నటించబోతోన్న ఈ సినిమాకి, డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 'గబ్బర్ సింగ్' ని మ్యూజికల్ హిట్ గా నిలబెట్టిన దేవిశ్రీ ప్రసాద్, ఈ సినిమాకి కూడా తన దైన శైలిలో స్వరాలను సమకూరుస్తున్నారు. గతంలో పవన్ ... పూరీ కాంబినేషన్లో వచ్చిన 'బద్రి' చిత్రం సూపర్ హిట్ కావడం, 'గబ్బర్ సింగ్' సంచలన విజయాన్ని సాధించడం ఈ సినిమాపై అంచనాలని పెంచేస్తున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gabbar singh success meet
Nani range in tamilnadu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles