తొలిచిత్రం ‘ఏ మాయ చేసావె’ సినిమాతో అందరిని తన అందాలతో మాయ చేసి అగ్ర హీరోలను, దర్శక నిర్మాతలను తన ఇంటి ముందు క్యూ కట్టించుకునేలా చేసుకున్న చెన్నె భామ సమంత. ఈమె ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమాలు హిట్ కావడం, ఈమె అందాలకు హీరోలే కాకుండా, దర్శక నిర్మాతలు కూడా దాసోహం అవ్వడంతో ఈమె కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళిపోయింది.
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే తెలుసుకున్న సమంతా ఇప్పడు అదే సామెతను తూచా తప్పకుండా పాటిస్తుంది.. పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సమంత మొన్నటి వరకు రెమ్యునరేష్ 60 నుండి 80 లక్షల వరకు తీసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడుకి ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతుండటంతో ఈ భామ రేటు ఒక్కసారిగా పెంచేసిందటని సమాచారం.
తాజాగా ఓ తెలుగు సినిమాలో నటించడానికి ఒక్కసారిగా కోటిన్నర పారితోషికం తీసుకుంటోంది. టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా పేరు తెచ్చుకున్న బెల్లంకొండ సురేష్ ఇంత పెద్ద మొత్తంలో సమంతాకు పారితోషికం ఆఫర్ చేశాడని అంటున్నారు.గత కొంత కాలంగా సురేష్ తన తనయుడిని హీరోగా పరిచయం చేయాలని సన్నాహాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తన తనయుడి లాంచింగ్ భారీగా, క్రేజీగా వుండాలని భావిస్తున్న బెల్లంకొండ సురేష్ సమంతాను కోటిన్నర ఇచ్చి కొడుకు కోసం బుక్ చేసాడట. ఈ చిత్రానికి ఓ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. ఒక వేళ ఇదే నిజమైతే గనుక టాలీవుడ్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గా సమంతా రికార్డు కెక్కుతుంది.
ప్రస్తుతం సమంత రాజమౌళి ‘ఈగ’, నాగచైతన్యతో కలిసి ‘ఆటో నగర్ సూర్య’, నాని హీరోగా గౌతం మీనన్ దర్శకత్వంలో ‘ఎటో వెళ్లి పోయింది మనసు’, మహేష్ బాబు సరసన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో సిద్ధార్థ సరసన, రామ్ చరణ్ సరసన ‘ఎవడు’ చిత్రంలో, మణిరత్నం సినిమా ‘కడల్’లో నటిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more