కేవలం బాలీవుడ్ నే కాదు, యావత్ దక్షిణ భారత సినిమానూ కొన్నేళ్ల పాటు ఉర్రూతలూగించిన కథానాయిక మాధురీ దీక్షిత్. ఈ అందగత్తెను లండన్ వాసులు ఇకపై రోజూ సందర్శించుకునే అవకాశం రాబోతోంది. లండన్ లోని మేడం టుస్సాడ్ వ్యాక్స్ మ్యూజియంలో ఈ సుందరాంగి కొలువుదీరనుంది.
ఆమె మైనపు బొమ్మను ఈ మ్యూజియంలో మార్చి 7 న ఆవిష్కరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వర్తమానం ఇప్పటికే మాధురీ దీక్షిత్ కి సదరు మ్యూజియం నుంచి అందింది. ఈ మైనపు బొమ్మ తయారుకావడానికి నాలుగు నెలల సమయం పట్టింది. సుమారు లక్షా ఏభై వేల పౌండ్లు ఇందుకోసం ఖర్చు చేశారు.
ఇప్పటికే ఆ మ్యూజియంలో షారుఖ్, సల్మాన్, హృతిక్, ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్ వంటి బాలీవుడ్ తారల మైనపు బొమ్మలు అక్కడ కొలువుదీరాయి. కొంత ఆలస్యమైనప్పటికీ ఇప్పుడైనా మాధురీ మాధుర్యాన్ని లండన్ వాసులే కాదు, అంతర్జాతీయంగా ఎంతో మంది విదేశీ పర్యాటకులు సందర్శించే ఆ మ్యూజియమ్ లో కొలువు తీరటం సంతోషదాయకం.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more