ప్లీనరీలో పదే పదే సీఎం అవుతాననే తప్ప, ఎక్కడా ప్రజా సేవ చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పలేదని అంటున్నాడు టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. క్రిమినల్ చరిత్ర ఉన్న జగన్ నాయకుడు కాలేడని, కానీ, ఖల్ నాయక్ మాత్రం అవుతాడని ఎద్దేవా చేశాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్న కోరిక జగన్ లో ఎంతగానో ఉందని అన్నారు. 30 ఏళ్లు సీఎంగా ఉంటానని చెప్పుకోవటమే అందుకు నిదర్శనమని తెలిపాడు.
మంచి నాయకుడు ఎవరయినా సరే ప్రజాసేవ చేస్తానని అంటారని, కానీ జగన్ మాత్రం సీఎం అవుతానని మాత్రమే చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించాడు. వైఎస్ చనిపోయిన తీరువాత భౌతిక కాయాన్ని బయటకు తీసుకురాకముందుకే జగన్ సంతకాలు చేయించుకున్నారని సీఎం కావాలన్న కోరిక జగన్కి అంతగా ఉందో తెలిసిపోతుందనన్నాడు. వక్ఫ్ బోర్డు బాధ్యతలు అప్పగించిన తర్వాత జలీల్ ఖాన్ ఇలా మీడియాతో మాట్లాడాడు.
బడ్జెట్ కూడా సరిపోదు... జేపీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తాను సీఎం అయ్యాక చేసే 9 పనులపై హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. జగన్ ఇచ్చిన హామీలపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని ఎద్దేవా చేశాడు. అమరావతిలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. అనంతరం ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... సీఎం పీఠమెక్కాలన్నదే జగన్ ధ్యేయమన్నాడు. అందుకోసమే ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యాఖ్యానించాడు.
నియోజక వర్గాల పెంపుపై ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. అలా విశాఖపట్నానికి రైల్వే జోన్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబు నాయుడు సూచించారని అన్నారు. ఈ సారి పార్లమెంటు సమావేశాల్లో విశాఖపట్నానికి రైల్వే జోనుపై గట్టిగా పోరాడతామని స్పష్టం చేశాడు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more