గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మద్దతు ప్రకటించిన జనసేనాధిపతి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఆ పార్టీపై కాస్త గుర్రుగానే వున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఇంతవరకు ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చలేదు. దాంతో ఆయన అసంతృప్తిగానే ఉన్నట్టు కనిపిస్తోంది. గురువారం ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్.. ఆయన మాటల్లోనే ఆ అసంతృప్తి భావం స్పష్టంగా కనిపించింది.
ఆంధ్ర ప్రజలకు ఇచ్చిన హామీలలో వేటినీ నెరవేర్చనప్పుడు బీజేపీ దెబ్బతినడం ఖాయమని పవన్ పేర్కొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వనప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు. కానీ కచ్చితంగా కేంద్రం నిధులు ఇచ్చి తీరాలని ఆయన స్పష్టం చేశారు. వాళ్లిచ్చిన మాట వెనక్కి తీసుకుంటే బీజేపీ నష్టపోయే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రజలకు నష్టం జరిగినా, అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోనన్నారు. ఇటీవల అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు హామీలన్నీ నెరవేరుస్తామని ప్రధాని చెప్పారని, అందుకే వేచి చూస్తున్నానని పవన్ అన్నారు. అలాగని రోడ్లపైకి వచ్చి, ఆందోళన చేస్తే ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. ఏ సమస్యనైనా వ్యవస్థాగతంగా చర్చిస్తేనే ఫలితం ఉంటుందని తెలిపారు.
ఇక తాను స్థాపించిన జనసేన పార్టీ గురించి పవన్ మాట్లాడుతూ.. ఆ పార్టీని విస్తరించడానికి తనకు తగిన ఆర్థిక స్థోమత లేదని పవన్ స్పష్టంగా తెలియజేశారు. త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలపై చంద్రబాబుతో చర్చించలేదని చెప్పారు. తమ భేటీలో ఆ అంశం అసలు ప్రస్తావనకు రాలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి రావలసిన విధులు, హామీలపైనే బాబుతో చర్చించానని పేర్కొన్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more