మాజీ రాజ్యసభ్యుడు నందమూరి హరికృష్ణ గత కొన్ని రోజులుగా మౌనంగా ఉన్నారు. పార్లమెంటు ల్లో సమైక్యాంద్ర కోసం పోరాడి వ్యక్తి ఒక్క నందమూరి హరికృష్ణ సీమాంద్ర ఎంపీలు, మంత్రులు, సమైక్యాంద్ర కోసం దొంగ రాజీనామాలు చేసి డ్రామాలు అడితే., సమైక్యాంద్ర కోసం, తెలుగు జాతి కోసం, తెలుగు ప్రజల కోసం, తన తండ్రి ఆశయాల కోసం, నిండు సభలో.. నేను సమైక్యాంద్ర కోసం రాజీనామా చేస్తున్నని చెప్పి, ఢిల్లీ పెద్దలకు సీతయ్య సవాల్ విసిరిన విషయం తెలిసిందే. చివరకు తన పార్టీ ఎంపీలే.. సమైక్యాంద్ర కోసం దొంగ డ్రామాలు ఆడిన విషయం తెలుసుకొని, మనోవేధనతో భాదపడుతూ.. పార్టీ దూరంగా ఉండటం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజల జీవితాలతో ఆడుతున్న ఆటలు చూసి, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపుకుడి తనయుడిగా.. కాంగ్రెస్ పార్టీ అధినేత పై సీతయ్య లేఖతో నిప్పులు కురిపించారు.
తెలుగు ప్రజలు సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు. అంతేకాని సీమాంద్ర కోసం ప్యాకేజీలు కాదని హరికృష్ణ మండిపడ్డారు. నందమూరి సీతయ్య ఇప్పుడు సోనియా గాంధీ, కాంగ్రెస్ నాయకులను టార్గెట్ చేయటం జరిగింది. ఆయన వారి పై మండిపడుతూ.. రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ వ్రాయటం జరిగింది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజన పేరుతో .. దేశాన్ని విచ్చిన్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ని లక్షంగా చేసుకొని తీవ్రమైన విమర్శలు కురిపించారు. మొదట కాంగ్రెస్ నాయకులు, దేశప్రజలు కలిసి సోనియా గాంధీ మన దేశం నుండి తరిమికొట్టాలని సూచించారు.
సీమాంద్ర కాంగ్రెస్ నాయకులపై కూడా సీతయ్య మండిపడ్డారు. ముందు మీ అమ్మను మన రాష్ట్రం నుండి తరిమికొట్టండి, ఆ తరువాత, దేశ ప్రజలు ఆమె దేశం నుండి తరిమికొడతారని అన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని, తెలుగు ప్రజలు ఓట్లు అడుగుతుందని హరికృష్ణ అన్నారు. సందట్లో సడేమియలాగా తెలుగుదేశం ఎంపీలను కూడా సీతయ్య ఉతికిపారేసాడు. నాతో పాటు మా పార్టీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి ఉంటే.. పరిస్థితి ఇంతదాక వచ్చేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. . విభజనపై కేంద్రం ఇప్పుడు ఇస్తున్న హామీలు 2014 ఎన్నికల తర్వాత ఎవరు బాధ్యత వహిస్తారని రాష్ట్ర ప్రజలకు హరికృష్ణ రాసిన లేఖలో కేంద్రాన్ని ప్రశ్నించారు. సీతయ్య లేఖతో .. ఇటు కాంగ్రెస్ పార్టీలోను, అటూ తెలుగుదేశం పార్టీలోను.. తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నేతలు నందమూరి సీతయ్యకు ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more