రాష్ట్ర విభజన ఏర్పాటు జరిగితే.. దేశానికి ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ హెచ్చరించారు. ఈరోజు జరిగిన సమావేశలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఇంటెలిజెన్స్ బ్యూరో, డీజీపీ, ఐజీల సమావేశం నిర్వహించింది. ఇందులో ఐబీ చీఫ్ ఇబ్రహీం కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దేశ భద్రతకు ముప్పుగా మారే అవకాశముందని ఆయన హెచ్చరించారు.
ఒకవైపు కేంద్ర ప్రభుత్వం తెలంగాణా ప్రక్రియపై శరవేగంతో ముందుకు వెళ్తుండగా కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ఇబ్రహీం ఈరోజు కీలక వ్యాఖ్యలు చేయటం జరిగింది.. దేశ భద్రతపై నిర్వహించిన డీజీపీ, ఐజీపీల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ అంశం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితమైంది కాదని దేశవ్యాప్తంగా కొత్త సవాళ్లను లేవనెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా పదేపదే హెచ్చరిస్తున్న విషయం తెల్సిందే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల నక్సలిజం పెరిగిపోతుందని అనేక సార్లు కేంద్రానికి సిఎం చెప్పటం జరిగింది. తెలంగాణ ఏర్పాటు నిర్ణయంతో భద్రతా సంస్థలకు కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అన్ని వ్యవస్థలు అప్రమత్తంగా మెలగాలని ఆయన సూచించారు. అసలే ఎక్కడ విభజన ప్రక్రియ ఆగిపోతుందోనని ఆందోళనలో ఉన్న తెలంగాణావాదులు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ చేసిన హెచ్చరికలు వారిని మరింత ఆందోళనకు గురిచేశాయి.
కాగా, సాధ్యమైనంత త్వరలో తెలంగాణ ప్రక్రియను పూర్తి చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్కుమార్ షిండే వెల్లడించారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం ఇవాళ నార్త్బ్లాక్లో సమావేశమై చర్చించిన అనంతరం ఆయన మాట్లాడారు. వచ్చే వారం మరోసారి జీవోఎం సమావేశమవుతుందని ఆయన పేర్కొన్నారు. జీవోఎం త్వరలో తుది నివేదికను ఖరారు చేస్తుందని స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రి చిదంబరం విదేశాల్లో ఉన్నందున ఇవాళ్టి సమావేశానికి హాజరుకాలేకపోయారని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more