రాష్ట్ర విభజన పై విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ దూకుడు పెంచారు. లగడపాటి మాటల్లో చురుకుతనం పెంచారు. అదే విధంగా.. తన చేయి కూడా పని చెప్పటానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మద్య కాలంలో లగడపాటి వార్తలు వాసే వారికి వార్నింగ్ ఇవ్వటం జరుగుతుంది. రాష్ట్ర విభజనపై లగడపాటి ఎన్ని మీడియా ప్రకటనలు చేసిన ప్రజలు మాత్రం లగడపాటి గురించే పట్టించుకోవటం లేదు. అందుకే లగడపాటి తన రూటు మార్చి వార్తలు వాసే వారిపై విరుచుకుపడుతున్నారు. దీంతో ఆయనకి కావాల్సిన ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది. ఈరోజు లగడపాటి ఢిల్లీలో ఇలాంటి ఝాలక్ ఇవ్వటం జరిగింది.
లగడపాటి రాజగోపాల్ మరోసారి జర్నలిస్టులపై జులుం ప్రదర్శించారు. జర్నలిస్టులపై నోరు పారేసుకున్నారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందానికి నివేదిక పంపిన విషయాన్ని తెలిపేందుకు లగడపాటి ఈరోజు ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.జర్నలిస్టులు ప్రశ్నలు సంధించడంతో ఆయన అసహనం ప్రదర్శించారు.
ప్రశ్నలు అడిగిన పాత్రికేయులపై రుసరుసలాడారు. అవసరమయితే చేయి కూడా చేసుకుంటానని హెచ్చరించారు. మీ అంతు చూస్తానంటూ ఆవేశంతో ఊగిపోయారు. దీంతో అక్కడున్న వారు కల్పించుకుని ఆయనను పక్కకు తీసుకుపోయారు. జర్నలిస్టుల పట్ల లగడపాటి వ్యవహరించిన తీరును పాత్రికేయ సంఘాలు ఖండించాయి. ఆయన వైఖరి అభ్యంతరకరంగా ఉందని పేర్కొన్నాయి.
గతంలో లగడపాటి విజయవాడలో.. ఒక దినపత్రి విలేకర్లపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు జర్నలిస్టుల పై మండిపడటం చూస్తే.. ఆయన కు మీడియా మీద ఎంత కసి ఉందోనని పాత్రికేయ సంఘాలు అంటున్నారు. లగడపాటి తీరుకు నిరసనగా జర్నలిస్టులు నిరసన తెలిసిన ఆశ్చర్యంలేదని ఢిల్లీలోని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. లగడపాటి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని అందుకే అలా ఆవేశపడుతున్నారని కాంగ్రెస్ నాయకులే చెప్పుకుంటున్నారు. అసలు ఇంతకీ లగడపాటికి ఏం చెప్పదలచుకున్నారనే విషయం మాత్రం ఎవరికి తెలియలేదు. దీంతో జర్నలిస్టులు అక్కడి నుండి తిరిగి వెళ్లిపోయారు. ఇక లగడపాటి మీడియా ప్రెస్ మీట్ పెడితే.. జర్నలిస్టులే వస్తారో లేదో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more