కొంచెం స్పీడ్ పెంచండని.. మన రాష్ట్ర గవర్నర్ ఢిల్లీ పెద్దలను సూచించారు. రాష్ట్ర విభజనపై మీరు స్పీడ్ పెంచాలని ఆయన సూచింనట్లు సమాచారం. రాష్ట్ర విభజన ఢిల్లీ హైకమాండ్ ప్రకటన చేసిన తరువాత మొట్ట మొదటిసారిగా ఢిల్లీ వెళ్లిన మన రాష్ట్ర గవర్నర్ ఈఎన్ఎల్ నరసింహన్ ఢిల్లీలో కాంగ్రెస్, ప్రభుత్వ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు, రాష్ట్ర విభజన కోసం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీలో సభ్యులైన హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, ఆర్థిక మంత్రి చిదంబరం, ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది వ్యవహారాల మంత్రి వి. నారాయణస్వామి, ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతి ఆసిఫ్ ఇబ్రహింతో భేటీఅయ్యారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆపార్టీ రాష్ట్ర వ్యవహారా పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ తో కూడా వేర్వేరుగా భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన ఢిల్లీ పెద్దలకకు ప్రత్యేక నివేదికలు అంధించినట్లు తెలిసింది. ముఖ్యంగా శాంతిభద్రతల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలిసింది. ముఖ్యంగా జులై 30 తర్వాత సీమాంద్రలో ప్రారంభమైన ప్రజా ఉద్యమం, ఏపీఎన్జీవోలతో పాటు, వివిధ ఉద్యోగ సంఘాల సమ్మెకారణంగా తలెత్తిన పరిస్థితులను ఆయన ప్రత్యేకంగా వివరించినట్లు సమాచారం. విభజనపై నిర్ణయం తీసుకున్నందున వేగవంతంగా దాన్ని అమలు చేయాలని, లేదంటే పరిస్థతులు , అనూహ్య మలుపులు తిరిగే అవకాశం ఉందని నరసింహన్ చెప్పినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, భవిష్యత్తులో ముసాయిదా బిల్లు శాసనసభ అభిప్రాయం కోసం పంపినప్పుడు శాసనసభలో కనిపించే బలాబలాల గురించి రాష్ట్రపతికి వివరించినట్లు తెలుస్తోంది. సోనియా గాంధీ మనోభావాన్ని బట్టి మసలుకొనే నరసిహంన్ ..ఢిల్లీలో అన్ని చోట్లా రాష్ట్ర విభజనకు అనుకూలంగానే వాదనలు వినిపించినట్లు తెలుస్తోంది. విభజన ఎంత త్వరగా జరిగితే అంత త్వరగా పరిస్థితులు సర్థుకుంటాయని, ఆలస్యమయ్యేకొద్దీ సీమాంద్ర ప్రజల్లో ఆశలు రేగి అనుచిత పరిస్థితులకు దారితీసే అవకాశవం ఉంటుందని ఆయన చెప్పినట్లు సమాచారం. చాలాకాలం నుంచి తానుఢిల్లీకి రాలేదని, కేవలం మర్యాదపూర్వకంగానే వచ్చి కలిశానని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more