రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో, ప్రభుత్వ అధికారులతో బిజీ బీజీగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో కొంత మంది సీమాంద్ర నేతలు సమైక్య రాష్ట్ర అంశంపై సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు మరోసారి ఢిల్లీ బాటపట్టారు. అయితే ఈరోజు ఉదయం ఢిల్లీ వెళ్లిన పలువురు సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని రాత్రి ఏడుగంటలకు కలువనున్నారు. కొంత మంది సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఇచ్చినట్టు సమాచారం.
ఢిల్లీ పెద్దలతో రాష్ట్ర విభజనపై కొంత మంది సీమాంద్ర కాంగ్రెస్ నేతలు.. సరికొత్త ప్రయోగాలు చెయ్యటానికి వెళ్లినట్లు సమాచారం. రాష్ట్ర విభజన ప్రక్రియ వేగవంతం అవుతుందని, రాష్ట్ర వ్యహారాల ఇన్ చార్జీ ప్రతి రోజు మీడియా ముందు చెబుతున్నారు. ఇలాంటి సందర్భంలో సీమాంద్ర కాంగ్రెస్ నేతలు.. కాంగ్రెస్ పెద్దలను కలిసే అవకాశం ఎక్కువుగా ఉంది
రాష్ట్ర విభజన ప్రక్రియ ఏకపక్షంగా సాగుతోందని.... విభజన వల్ల తలెత్తే సమస్యలను పరిష్కారంపై కేంద్రం స్పష్టత ఇవ్వకుండా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తోందంటూ సీమాంధ్ర నేతలు ఫిర్యాదు చేయనున్నారు. అయితే రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుందని...అప్రజాస్వామిక విధానాన్ని నిలిపివేయాలని రాష్ట్రపతిని కోరతామన్నారు. ఈరోజు రాత్రి ఏడు గంటలకు రాష్ట్రపతి, ఎనిమిది గంటలకు దిగ్విజయ్ ను కలుస్తామన్నారు.
విభజనపై అసెంబ్లీ తీర్మాణం లేకుండా తెలంగాణ ఏర్పాటు చేయడం అప్రజాస్వామికమన్నది సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఆరోపణ. తెలంగాణ ముసాయిదా బిల్లును అసెంబ్లీ వ్యతిరేకిస్తే విభజన ప్రక్రియను ఆపాలంటూ రాష్ట్రపతిని సీమాంధ్ర నేతలు కోరనున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్తో భేటీ కానున్న నేతలు... విభజన నిర్ణయం వల్ల సీమాంధ్రలో కుదేలైన కాంగ్రెస్ను ఎలా బతికిస్తారో చెప్పాలంటూ ప్రశ్నించనున్నారు.
విభజన ముసాయిదా బిల్లు నవంబర్ అఖరుకల్లా అసెంబ్లీకి రానున్న నేపధ్యంలో సమైక్య రాష్ట్ర డిమాండ్పై సీమాంధ్ర నేతలు చేస్తున్న ఈ తాజా ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. హస్తిన చేరుకున్న వారిలో మంత్రులు గంటా శ్రీనివాసరావు,టీజీ వెంకటేష్,ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.
రాష్ట్ర విభజన పై సరికొత్త ప్రయోగాల చేయటానికి ఢి్ల్లీ వెళ్లిన సీమాంద్ర నేతలు విషయం తెలుసుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఢిల్లీలో ఏం జరుగుతుందో అనే భయంతో తెలంగాణ కాంగ్రెస్ నెతలు కలవరం చెందుతున్నారు. రాష్ట్ర గవర్నర్, సీమాంద్ర నేతలు.. హైదరాబాద్ వచ్చే వరకు తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఉన్న టెన్షన్ తగ్గదనే రాజకీయ మేధావులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more