వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కడప ఎంపీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిళ తన అన్న జైలు పాలు కావడంతో మరో ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర అక్టోబర్ 18, 2012 ను ఇడుపులపాయ నుండి సుదీర్ఘ పాదయాత్రను మొదలు పెట్టిన విషయం తెలిందే. ఆ రోజు నుండి డిసెంబరు 14 వరకు సాగింది. డిసెంబర్ 14వ తేదీన మోకాలికి గాయం అయిందని రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ వద్ద నడకను నిలిపివేశారు. 2012 డిసెంబరు 18న ఆమె మోకాలికి ఆపరేషన్ (ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ) జరిగిందని, విశ్రాంతి అవసరమని కుటుంబ సభ్యులు, పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నా షర్మిళ మోకాలికి ఆపరేషన్ జరిగిందా ? జరిగితే ఇంత తొందరగా కోలుకొని తిరిగి మళ్లీ యాత్రను ప్రారంభించిందా ? అనే సందేహాం పై రాజకీయ వర్గాల్లో, (ఇంటర్నెట్) సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతోంది. షర్మిల మోకాలికి ఆపరేషన్ అబద్ధమని, అదంతా నటన అని కొందరు నెటిజన్లు ఫొటోలు పోస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. షర్మిళ ఆపరేషన్ తరువాత వీల్చైర్లో కూర్చోబెట్టిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది ఆపరేషన్ జరిగిన నాలుగు వారాలకే జనవరి 20వ తేదీన షర్మిల చంచల్గూడ జైలుకు వెళ్లి సోదరుడు జగన్ను కలిశారు. జైలు నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆమె నడక తీరే ప్రస్తుత వివాదానికి మూల కారణం.
జైలు గేటు నుంచి బయటకు వస్తున్న షర్మిల ఎడమచేతితో సపోర్ట్ స్టిక్ పట్టుకుని ఉన్నారు. అయితే అది కింద ఆన్చి లేదు. ఎడమ కాలును కూడా గాల్లోకి లేపి, శరీరం మొత్తం బరువును కుడికాలిపై, అంటే ఆపరేషన్ జరిగిన కాలిపై ఉంచుతూ షర్మిల జైలు నుంచి బయటకు వచ్చారు. దీంతో షర్మిళ పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో కుప్పలు తెప్పలుగా కామెంట్స్ పోస్టు చేశారు. ఇటు నెటిజన్లే కాకుండా తెలుగుదేశం నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు మీడియాతో మాట్లాడుతూ శస్త్రచికిత్సపై షర్మిల నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. "కుడికాలికి గాయమైనట్టు ముందు చెప్పారు. తర్వాత ఎడమ కాలు పైకెత్తుతూ జైలు నుంచి బయటకు వచ్చారు. రెండు ఫొటోలూ వారి పత్రికలోనే వచ్చాయి. ఏ కాలికి దెబ్బ తగిలిందో, ఏ కాలికి ఆపరేషన్ చేశారో వారికే తెలియాలి'' అని అన్నారు. మరి షర్మిళకు ఆపరేషన్ జరిగిందా లేదా ? అన్నది మాత్రం పై వాడికే తెలియాలి అని అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more