సినీ రంగం నుండి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన అలనాటి అందాల నటి జయప్రద తొలుత రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశించి తెలుగు దేశం పార్టీలో చేరి అక్కడ తెలుగు మహిళా అధ్యక్షురాలిగా కూడా బాధ్యతలు చేపట్టి, తరువాత విభేధాలతో బయటకి వచ్చి, ఉత్తర ప్రదేశ్ కి వెళ్ళి అక్కడ సమాజ్ వాదీ పార్టీలో చేరి తనదైన శైలిలో రాణించి, ఎంపీగా కూడా కొనసాగుతున్నారు. అక్కడ దశాబ్దకాలంగా ఉంటున్న జయప్రద ఈ మధ్యనే సమాజ్ వాదీ పార్టీ నుండి బయటకు వచ్చింది. ఇప్పుడు 2014 ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ మన రాష్ట్రం పై కన్నేసిన జయప్రద రాష్ట రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తానని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. మరి మళ్ళీ ఈమె ఏ పార్టీలో చేరుతారు అని అడినప్పుడల్లా దాటవేసిన జయప్రద తాజాగా చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ మధ్యన హైదరాబాద్ కి వచ్చిన జయప్రద మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు, సమాజ్వాది పార్టీ చీఫ్ ములాయం సింగ్ వంటి వారు తమ పార్టీల గెలుపు కోసం సినిమా తారలను వాడుకుంటారని ఆరోపించారు. పార్టీ గెలిచిన తర్వాత మర్చిపోతారని, ఇలా...తారల్ని ఉపయోగించుకొని మర్చిపోయే వారిలో బాబు, ములాయం ఉన్నారని జయప్రద విమర్శించారు. తెలంగాణపై స్పందిస్తూ.. తాను ఆంధ్రాలో పుట్టినప్పటికీ తెలంగాణ ప్రజలు కూడా తనను ఆదరించారన్నారు. ఏ ప్రాంతానికి నష్టం జరగకుండా... తెలంగాణ అంశాన్ని కేంద్రం త్వరగా తేల్చాలని ఆమె డిమాండ్ చేశారు.
గతంలో టీడీపీలో ఉన్న జయప్రద తాజాగా చంద్రబాబు నాయుడు పై విమర్శలు చేయడం చూస్తుంటే...ఆమె కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. మరి ఇంత వరకు ఇక్కడా స్థిరంగా లేని జయప్రద ఈ పార్టీలో చేరితే ఎన్ని రోజులు ఉంటారో కూడా చెప్పలేమని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more