హిందువులు అత్యంత గొప్పగా భావించే కుంభమేళా సందడి నేటి (సోమవారం) నుంచి అలహాబాద్ లోని కుంభనగరి ప్రాంతంలో ప్రారంభమైంది. ఈ మేళాకు హిందు మతంలో ఒక ముఖ్యమైన స్థానముంది. ఈ సమయంలో.. మూడు నదుల(గంగ, యమున, సరస్వతి) సంగమంలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని, పుణ్యలోకాలు సిద్ధిస్తాయని హిందువులు భావిస్తారు. అందుకే కోట్లాదిగా కుంభమేళాకు వస్తారు.
ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే.. ఇవాల్టి నుంచి అంటే (ఈ నెల 14) నుంచి 56 రోజులపాటు జరిగే కుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెండేళ్ల క్రితమే ఏర్పాట్లు ప్రారంభించింది. 58.03 కిలోమీటర్ల విస్తీర్ణంలో కుంభనగరి ప్రాంతాన్ని అభివృద్ది చేసింది. 2001లో కుంభమేళా జరిగినప్రాంతం దాదాపు 2,802 ఎకరాలు ఉంటే.. ఈసారి అది 4,932 ఎకరాలకు పెరిగింది. శాంతి భద్రతల పర్యవేక్షణకు దాదాపు 30 వేల మంది పోలీసులను ఈ ప్రాంతంలో మోహరిస్తున్నారు. అవసరమైతే సైన్యాన్ని కూడా రంగంలోకి దింపడానికి ఏర్పాట్లు చేశారు. స్నానఘట్టాల వద్ద అంబులెన్స్లను సిద్ధం చేశారు. కుంభనగరిలో 600 పడకల ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేశారు. కుంభమేళా జరిగే ప్రాంతానికి సమీపంలోనే పెరేడ్ గ్రౌండ్స్ ఉంది. ఇక్కడా అనేక గుడారాలను నిర్మించారు. మత పెద్దలందరూ వీటిలోనే విడిది చేస్తారు. వాటిలోనే యజ్ఞాలు చేసుకొనేందుకు, సమావేశాలు నిర్వహించుకొనేందుకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ 85 స్విస్ కాటేజీలను నిర్మించింది. వీటిని రోజుకు రూ.ఆరువేల చొప్పున అద్దెకు ఇస్తున్నారు. అలాగే కుంభమేళాకు సంబంధించిన డిజిటల్ మ్యాప్లను ప్రభుత్వం తొలిసారి అందుబాటులోకి తీసుకొచ్చింది. కుంభమేళాకు వచ్చే బస్సులు, భారీ వాహనాలను అలహాబాద్ అవతలే ఆపేస్తున్నారు. కుంభమేళాలో కొన్ని రోజులను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ ఏడాది జనవరి 14 (మకర సంక్రాంతి), 27 (పౌర్ణమి), ఫిబ్రవరి 6 (ఏకాదశి), 10 (అమవాస్య), 15 (వసంత పంచమి), 17 (రథ సప్తమి), 18 (భీష్మాష్టమి), 25 (మాఘ పౌర్ణమి) దినాలలో ఎక్కువ మంది భక్తులు కుంభమేళాకు స్నానాలు చేయటానికి వస్తారని భావిస్తున్నారు.
వేద సంస్కృతిలో నదులన్నింటినీ దేవతలుగా భావిస్తారు. ఈ నదులన్నింటిలో కూడా గంగానదికి మరింత ప్రత్యేకత ఉంది. విష్ణువు పాదాల నుంచి ఈ నది నేరుగా భూమిపైకి వచ్చిందని, దీనిలో స్నానం చేస్తే అన్ని పాపాలు పోతాయని హిందువుల భావన. క్షీరసాగర మథన ఫలితంగా ఉద్భవించిన అమృత కలశం కోసం దేవతలు, రాక్షసులు యుద్ధం చేస్తుండగా.. ఆ కలశం ఒలికి నాలుగు చుక్కల అమృతం అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో పడ్డాయని పురాణాలు చెబుతాయి. అందువల్ల ఈ నాలుగు ప్రదేశాలలో ఒక చోట ప్రతి మూడేళ్లకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. అంటే ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి ఒక పట్టణంలో కుంభమేళా జరుగుతుందన్నమాట. ఆరేళ్లకోసారి జరిగే దాన్ని అర్ధ కుంభమేళా అని.. పన్నెండేళ్లకొకసారి జరిగేదాన్ని పూర్ణ కుంభమేళా అని, 144 ఏళ్లకోసారి జరిగేదాన్ని మహాకుంభమేళా అంటారు. అలహాబాద్లో గంగా, యమునా, సరస్వతి నదులు కలుస్తాయి కాబట్టి ఇక్కడి కుంభమేళాకు అంతటి ప్రత్యేకత.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more