సంక్రాంతి కోడిపందాల్లో రాజకీయ ఒత్తిళ్ళు బలంగానే పనిచేశాయి. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధుల్లో చాలామంది పోలీసులపై వత్తిడి తీసుకువచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో అయితే జిల్లా ఇన్చార్జి మంత్రి అయిన రాష్ట్ర హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై ఒత్తిడి తీసుకువచ్చి, సంక్రాంతి పండుగ రోజుల్లో కోడిపందాల గురించి పట్టించుకోవద్దని మంత్రి సబితా ఇంద్రారెడ్డితో మౌఖిక ఆదేశాలు జారీ చేయించినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో జిల్లాలో కోడిపందాల జోరుకు అడ్డూ, అదుపు లేకుండా పోయింది.
ఉభయగోదావరి జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతంలోనూ, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రాంతంలోనూ వందల కోట్ల రూపాయల మేర పందాలు జరిగినట్టు విశ్వస నీయ సమాచారం. హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి అనేక మంది ఉభయ గోదావరి జిల్లాల్లోని రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, రావులపాలెం, ఏలూరు, భీమవరం, కైకలూరు, జంగారెడ్డి గూడెం, తాడేపల్లి గూడెం, అత్తిలి, తణుకు, నిడదవోలు తదితర పట్టణాల్లోని లాడ్జిల్లో వారంరోజుల ముందుగానే దిగి, కోడిపందాల్లో పాల్గొన్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, ఆకివీడు మండలం ఐ.భీమవరం, కాళ్ళ మండలంలో ఏలూరుపాడు, జువ్వలపాలెం, ఉండి మండలంలో మహాదే వపట్నం, చిలుకూరు, ఉప్పులూరు, ఎండగండి, పాలకొడేరు మండలంలో పెన్నాడ, శృంగవృక్షం, మాగొల్లు, కోరుకొల్లు తదితర ప్రాంతాల్లో ను, భీమవరం మండలంలో వెంప, దిరుసుమర్రు, చిన్నఅమీరం, కొవ్వాడ, ఈలంపూడి, లోసరి, అదేవిధంగా వీరవాసరం, పాలకొల్లు, నర్సాపురం, మొగ ల్తూరు, ఆచంట మండలాల్లో యధేచ్చగా కోడిపందాలు సాగుతున్నాయి. అలాగే తూర్పు గోదావరి జిల్లాలో గోడిలంక పందాల వద్ద ఒకరిద్దరు పోలీసులు కూడా మఫ్టీలో కనిపించారు. పోలీసులకు తెలిసే ఈ పందాలు జరిగాయని స్థానికులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఏటా ముమ్మిడివరం నియోజకవర్గంలో ముఖ్యంగా ఐ.పోలవరం మండలంలో భారీ ఎత్తున జరిగే కోడిపందాలు ఈసారి అక్కడ జరగలేదు. గోడిలంకతోపాటు అయినవిల్లి మండలం, కపిలేశ్వరపురం మండలాల మధ్య సరిహద్దుగా వున్న గోదావరి లంకల్లో కూడా జూదం యధేచ్చగా సాగుతోంది.
నిన్న ఆదివారం ఒక్క రోజే తూర్పు గోదావరి జిల్లాలో దాదాపు రూ.400 కోట్లకు పైగా పందాలు జరిగినట్టు అంచనా. అలాగే కోడిపందాలకు రాష్ట్రంలోనే పేరొందిన పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం జరిగిన కోడిపందాల్లో రూ.600 కోట్లకు పైగానే పందాలు జరిగాయని, అంటే ఉభయగోదావరి జిల్లాల పరిధిలో భోగిపండుగ అయిన ఆదివారం రోజున రూ.వెయ్యి కోట్లకు పైగా పందాలు జరిగినట్టు అంచనా. రానున్న రెండు రోజుల్లో ఈ పందాల మొత్తం మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు పందెం రాయుళ్ళు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ పందెం బరిల వద్ద మద్యం విక్రయాలు కూడా జోరుగా జరిగాయి. సంక్రాంతి రోజైన ఇవాళ ఈ పందాల జోరు ఇంకా పెరిగింది రేపూ (మంగళ) కూడా ఇలాగే కోడిపందాలు సాగే అవకాశం కనిపిస్తుంది. సారా అమ్మకాలు కూడా యధేచ్చగా సాగినట్టు సమాచారం. ఇదిలావుండగా పేకాట, గుండాట, మూడు ముక్కలాట వంటి జూదాలు కూడా జోరుగా జరిగాయి.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more