టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్న మీకోసం యాత్ర అదిలాబాద్ జిల్లాలో సాగుతుంది. కుంటాల క్రాస్ రోడ్ , నందన్ క్రాస్రోడ్, నర్సాపూర్ (జి) క్రాస్రోడ్, చర్లపల్లి వరకు 11.5 కిలోమీటర్లు నడిచి బాబు యాత్ర 1100 కిలోమీటర్లు పూర్తి చేశారు. పాదయాత్రలో పలు సభలలో మాట్లాడిన బాబు అన్ని సభలను ఎఫ్ డీఐ లపై తెదేపా ఎంపీలు చేసిన మోసం పై ముఖ్యంగా ప్రస్తావించారు. తెలుగు దేశం పార్టీ ఎప్పుడు ఎఫ్ డీఐలకు వ్యతికేకమని, చిల్లర వర్తకులను నట్టేట ముంచే వాటికి మేం దూరం అని ఎప్పుడో చెప్పామని, మా ఎంపీలు చేసిన తప్పును క్షమించేది లేదని, నేను ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి పాయయాత్ర చేస్తుంటే.... ఎంపీలు ఇలా గైర్హాజరు అయి ఇలా ప్రతిష్ట దెబ్బతీయడం నన్ను ఎంతగానో బాధించిందని, అనారోగ్యం కారణంగా వెళ్లలేకపోయానని దేవేందర్ గౌడ్ ముందే చెప్పారు. మిగతా ఇద్దరూ (సుజనా చౌదరి, గుండు సుధారాణి) లిఖితపూర్వకంగా జరిగినదాన్ని నాకు వివరించారు. తప్పు చేశామంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. నాకూ, పార్టీ కార్యకర్తలకూ క్షమాపణ చెప్పారు. ఈ విషయాన్ని నేను పరిశీలిస్తున్నాను. ఒకవేళ ఎంపీలు ప్రలోభాలకు లోనయినట్లు తెలిస్తే.... క్షమించేది లేదని, అదే సమయంలో తెలియక పొరపాటు జరిగి ఉంటే శిక్షించడం కూడా సరికాదు.
ఒక ఎంపియో ఎమ్మెల్యేనో పోయినా ఫరవాలేదు. విలువలతో కూడిన రాజకీయం చేస్తా'' అని స్పష్టం చేశారు. సుజనా చౌదరి రాజీనామా సమర్పించాడని, దాన్ని పరిశీలించిన తరువాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల పై స్పందించిన బాబు రాష్ట్రాన్ని దోచుకున్న వారూ మమ్మల్ని విమర్శించే పరిస్థితికి వచ్చారు. జైల్లోఉండి కూడా ప్రణబ్కు ఓటు వేశారు. ఇప్పుడు ఎఫ్డీఐలపై గైర్హాజరయ్యారు. ఆ పార్టీ వాడినని చెప్పుకునే అనకాపల్లి ఎంపీ (సబ్బం హరి) కాంగ్రెస్కు అనుకూలంగా ఓటేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ వారు ముగ్గురు ఎమ్మెల్యేలను అమ్ముకుంది. ఇలాంటి వాళ్లా మా గురించి మాట్లాడేది?'' అని చంద్రబాబు ఎదురుదాడి చేశారు.ఎన్టీఆర్ గానీ తాను గానీ నిప్పులా బతికామని, అందుకే ఎవరూ ఏమీ చేయలేకపోయారని పేర్కొన్నారు.మొత్తం మీద రాజ్యసభ సభ్యులు క్షమాపణ కోరడం ద్వారా కొంత తీవ్రతను తగ్గించారు.. పార్టీ పరువు తీసిన వారి పై బాబు చర్య తీసుకోకపోవడం పై తన సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారని తెలుస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more