గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కురిపించే జునాగఢ్ ర్యాలీలో సోనియా గాంధీ విదేశీ పర్యటనలపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. సోనియా గాంధీ విదేశీ పర్యటనలు, చికిత్స కోసం 1,880కోట్ల ఖర్చు చేశారంటూ మోడీ ఆరోపించారు. ఒక ప్రాంతీయ వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని ఉటంకిస్తూ మోదీ ఈ ఆరోపణలు చేశారు. హర్యానాకు చెందిన ఆర్టీఐ కార్యకర్త రమేష్ వర్మకు ప్రభుత్వం ఈ సమాచారం ఇచ్చినట్టు మోడీ పేర్కొన్నారు. ఇటు మోడీ వ్యాఖ్యలపై ఆర్టీఐ కార్యకర్త రమేష్ వర్మ హర్యానాలో వివరణ ఇచ్చారు. సమాచార చట్ట కింద తనకు లభించిన నివేదికలో మోడీ ఆరోపించిన విధంగా ఎలాంటి లెక్కలూ లేవని రమేష్ వర్మ తేల్చిచెప్పారు. ఆ లెక్కల సమాచారం ఎక్కడితే మోదీనే అడగాలని చెప్పారు. మోడీ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ సైతం విరుచుకుపడింది.
సోనియాగాంధీపై ప్రభుత్వం చేసిన ఖర్చులు తప్పని తేలినందున ఆమెకు మదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. మరోవైపు పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా తాను ఆరోపణలు చేసిన మాట నిజమేనని మోదీ అంగీకరించారు. అయితే ఆ ఆరోపణలకు తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రజాధనం వివరాలను ప్రజలకు తెలుసుకునే హక్కు ఉందని తన నోరు మూయించాలంటే సోనియా 2004-2012 మధ్య చేపట్టిన విదేశీ పర్యటనలపై లెక్కలను ప్రధాని మన్మోహన్, కేంద్ర ప్రభుత్వం బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేసారు. తన ఆరోపణలు తప్పని నిరూపిస్తే కచ్చితంగా సోనియాకు క్షమాపణ చెబుతానన్నారు. మొత్తంమీద ఎంపీగా సోనియాగాంధీ పర్యటనలకు వెచ్చించిన ప్రజాధనం లెక్కలు చెప్పితీరాలంటూ మోడీ పట్టుబడుతుండగా సోనియా ఆరోగ్యాన్ని రాజకీయం చేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. మోడీ సవాల్ ను మన్మోహన్ సర్కార్ లైట్ గా తీసుకుంటుందా..? సమర్ధవంతంగా తిప్పుకొడుతుందా అనేది చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more