భారత టెన్నీస్ క్రీడాకారుడు మహేశ్ భూపతి ఆలిండియా టెన్నీస్ అసోసియేషన్(ఏఐటీఏ)పై ఎదురుదాడికి దిగారు. ఏఐటీఏ సభ్యులందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏఐటీఏ యువకులను ప్రోత్సహించడం లేదని ఆరోపించారు. ఏఐటీఏ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు.తమపై రెండేళ్ల పాటు నిషేధం విధించడంపై వివరణ ఇవ్వాలని భూపతి, రోహన్ బోపన్న ఎఐటిఎ నుంచి వివరణ కోరుతూ అంతకు ముందు లేఖ రాశారు. తమపై నిషేధం విధించడానికి అనుసరించిన పద్ధతులేమిటో తెలియజేయాలని వారు డిమాండ్ చేశారు. ఒలింపిక్స్లో లియాండర్ పేస్తో జత కట్టడానికి మహేష్ భూపతి నికారించడంతో అసలు సమస్య మొదలైంది. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ)పై తనపై విధించిన నిషేధాన్ని కోర్టులో సవాలు చేసే యోచనలో ఉన్నట్టు మహేష్ భూపతి తెలిపాడు.
అయితే ఏఐటీఏ తీసుకున్న నిర్ణయం న్యాయపరంగా సరైనదేనా కాదా అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పా డు. లండన్ ఒలింపిక్స్లో లియాండర్పేస్తో ఆడేందుకు నిరాకరించిన భూపతి/రోహన్ బోపన్నలను డేవిస్ కప్లో ఆడకుండా నిరోధించిన ఏఐటీఏ..తాజాగా ఆ నిషేధాన్ని 2014 ఏడాది జూన్దాకా పొడిగించిన విషయం తెలిసిందే.'రోహన్ దాదాపు పదేళ్లనుంచి భారత్కు ఆడుతున్నాడు. నేను కూడా 18 ఏళ్లనుంచి ఉన్నాను. ఇంత అనుభవమున్న మాపై నిషేధం చాలా దురుసు చర్య' అన్నాడు. ఏఐటీఏ తమపై తీసుకున్న ఈ చర్య కక్ష సాధింపుగా భూపతి అభివర్ణించాడు. ఈ డర్టీగేమ్లో తన సహచరుడు, మిత్రుడు కూడా అయిన బోపన్న చిక్కుకోవడం ఆవేదన కలిగిస్తోందని భూపతి వాపోయాడు.
(And get your daily news straight to your inbox)
Sep 26 | డీఎంకె పార్టీ అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, యూపీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయిన కరుణానిధి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పై కరుణ చూపలేదు. యూపీఏ ప్రభుత్వంలో రెండు కేబినెట్ పదవులు, కొన్ని సహాయ... Read more
Sep 22 | నవయుగ వైతాళికుడు, తెలుగు సాహిత్యంతో జాతిని మేల్కొలిపిన మహాకవి గురజాడ అప్పరావుకు విశాఖలో ఆదరణ కరువైంది. రాష్ట్రవ్యాప్తంగా మహాకవి 150జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటే..విశాఖలో మాత్రం ఆయన విగ్రహం దిక్కుమొక్కు లేకుండా దర్శనమిస్తోంది... Read more
Sep 18 | ఆఫ్ఘనిస్థాన్‑లో బ్రిటన్ రాకుమారుడు హ్యారీని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆప్ఘనిస్థాన్‑లో యువరాజు హ్యారీ ఉన్న బాస్టన్ శిబిరంపై తాలిబన్లు వరుసగా దాడులు జరిపారు. మొన్నటి దాడిలో అమెరికాకు చెందిన ఇద్దరు మైనర్లు మృతి చెందారు.... Read more
Sep 18 | రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా గందరగోళంగా ప్రారంభమైంది. రెండో రోజు పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలు స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. వెంటనే తెలంగాణా తీర్మానం చేయాలనీ టీఆర్ఎస్ నాయకులు స్పీకర్... Read more
Sep 18 | నిజామాబాద్ ఎమ్.పి మదుయాష్కి చేసిన దాడుల వ్యాఖ్యపై కృష్ణా జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్రంగా ఆక్షేపించారు.ఇది దిగజారుడుతనంగా ఆయన అభివర్ణించారు. తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరామ్ పై కూడా విమర్శలు... Read more