నిజామాబాద్ ఎమ్.పి మదుయాష్కి చేసిన దాడుల వ్యాఖ్యపై కృష్ణా జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్రంగా ఆక్షేపించారు.ఇది దిగజారుడుతనంగా ఆయన అభివర్ణించారు. తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరామ్ పై కూడా విమర్శలు సాగిస్తూ ఒక ఫ్రొఫెసర్ గా కాకుండా, ఫ్రొఫెషనల్ కిల్లర్ అన్న ఆలోచన కలుగుతుందని ఆయన అన్నారు. అయితే మధు యాష్కి రెచ్చగొట్టే ప్రకటనల వెనుక టిడిపి కుట్ర కూడా ఉందని అన్నారు. టిడిపి తెలంగాణ లేఖ ఇస్తామని చెప్పడం వల్లనే తెలంగాణ నేతలు కొందరు ఇలాంటి దాడుల హెచ్చరికలు చేస్తున్నారని అన్నారు. మధు యాష్కి చరిత్ర చెబితే ప్రజలు ఆయన బట్టల్ని ఊడదీసి కొట్టి పంపుతారని అన్నారు. చంద్రబాబు నాయుడు తన పదవి కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తుంటే ఆ పార్టీ సీమాంద్ర నేతలు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రం అంటూ నిరాహార దీక్షలు చేసిన టిడిపి నేతలు చేవచచ్చి కూర్చున్నారా అని జోగి రమేష్ తీవ్రంగా ప్రశ్నించారు.జోగి రమేష్ చేసిన విమర్శలు ఈ వివాదాన్ని పెంచుతాయే కాని తగ్గించవు. అయితే రాజకీయాలలో ఎదురు సమాధానం చెప్పకపోతే వారి ఉనికికి ప్రమాదం కనుక ఇలా చేస్తుంటారు.మధ్యలో ప్రజలు ఇబ్బంది పడాలి. నేతలు సంయమనం పాటించకపోవడం దురదృష్టకరం.
(And get your daily news straight to your inbox)
Sep 26 | డీఎంకె పార్టీ అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, యూపీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయిన కరుణానిధి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పై కరుణ చూపలేదు. యూపీఏ ప్రభుత్వంలో రెండు కేబినెట్ పదవులు, కొన్ని సహాయ... Read more
Sep 22 | నవయుగ వైతాళికుడు, తెలుగు సాహిత్యంతో జాతిని మేల్కొలిపిన మహాకవి గురజాడ అప్పరావుకు విశాఖలో ఆదరణ కరువైంది. రాష్ట్రవ్యాప్తంగా మహాకవి 150జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటే..విశాఖలో మాత్రం ఆయన విగ్రహం దిక్కుమొక్కు లేకుండా దర్శనమిస్తోంది... Read more
Sep 18 | భారత టెన్నీస్ క్రీడాకారుడు మహేశ్ భూపతి ఆలిండియా టెన్నీస్ అసోసియేషన్(ఏఐటీఏ)పై ఎదురుదాడికి దిగారు. ఏఐటీఏ సభ్యులందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏఐటీఏ యువకులను ప్రోత్సహించడం లేదని ఆరోపించారు. ఏఐటీఏ తన అధికారాన్ని దుర్వినియోగం... Read more
Sep 18 | ఆఫ్ఘనిస్థాన్‑లో బ్రిటన్ రాకుమారుడు హ్యారీని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆప్ఘనిస్థాన్‑లో యువరాజు హ్యారీ ఉన్న బాస్టన్ శిబిరంపై తాలిబన్లు వరుసగా దాడులు జరిపారు. మొన్నటి దాడిలో అమెరికాకు చెందిన ఇద్దరు మైనర్లు మృతి చెందారు.... Read more
Sep 18 | రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా గందరగోళంగా ప్రారంభమైంది. రెండో రోజు పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలు స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. వెంటనే తెలంగాణా తీర్మానం చేయాలనీ టీఆర్ఎస్ నాయకులు స్పీకర్... Read more