రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా గందరగోళంగా ప్రారంభమైంది. రెండో రోజు పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలు స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. వెంటనే తెలంగాణా తీర్మానం చేయాలనీ టీఆర్ఎస్ నాయకులు స్పీకర్ పోడియాన్ని చట్టుముట్టి తెలంగాణా నినాదాలు చేశారు. లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ప్రసంగాన్ని టీఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. జయప్రకాశ్ నారాయణ రాష్ట్రంలో భద్రత లేకపోవటం వల్లే ఐటీ ఉద్యోగులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారన్నారు. దీంతో సభలో రగడ మొదలైంది. కొంత మంది ఉద్యోగులు వెళ్ళిపోతేనె భాధ పడుతున్నారని, తెలంగాణాకోసం వందలమంది మంది బలయ్యారని టీఆర్ఎస్ నాయకులులన్నారు. అయిన జెపి తన ప్రసంగాన్ని కొనసాగించే ప్రయత్నం చేయడంతో, కోపంతో హరీష్ రావు మైక్ విరగ్గొట్టారు. కావాలనే సభను జేపీ తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన స్పీకర్ సభను వాయిదా వేశారు.
(And get your daily news straight to your inbox)
Sep 26 | డీఎంకె పార్టీ అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, యూపీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయిన కరుణానిధి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పై కరుణ చూపలేదు. యూపీఏ ప్రభుత్వంలో రెండు కేబినెట్ పదవులు, కొన్ని సహాయ... Read more
Sep 22 | నవయుగ వైతాళికుడు, తెలుగు సాహిత్యంతో జాతిని మేల్కొలిపిన మహాకవి గురజాడ అప్పరావుకు విశాఖలో ఆదరణ కరువైంది. రాష్ట్రవ్యాప్తంగా మహాకవి 150జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటే..విశాఖలో మాత్రం ఆయన విగ్రహం దిక్కుమొక్కు లేకుండా దర్శనమిస్తోంది... Read more
Sep 18 | భారత టెన్నీస్ క్రీడాకారుడు మహేశ్ భూపతి ఆలిండియా టెన్నీస్ అసోసియేషన్(ఏఐటీఏ)పై ఎదురుదాడికి దిగారు. ఏఐటీఏ సభ్యులందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏఐటీఏ యువకులను ప్రోత్సహించడం లేదని ఆరోపించారు. ఏఐటీఏ తన అధికారాన్ని దుర్వినియోగం... Read more
Sep 18 | ఆఫ్ఘనిస్థాన్‑లో బ్రిటన్ రాకుమారుడు హ్యారీని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆప్ఘనిస్థాన్‑లో యువరాజు హ్యారీ ఉన్న బాస్టన్ శిబిరంపై తాలిబన్లు వరుసగా దాడులు జరిపారు. మొన్నటి దాడిలో అమెరికాకు చెందిన ఇద్దరు మైనర్లు మృతి చెందారు.... Read more
Sep 18 | నిజామాబాద్ ఎమ్.పి మదుయాష్కి చేసిన దాడుల వ్యాఖ్యపై కృష్ణా జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్రంగా ఆక్షేపించారు.ఇది దిగజారుడుతనంగా ఆయన అభివర్ణించారు. తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరామ్ పై కూడా విమర్శలు... Read more